అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సంక్రాంతి పండుగకు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర విడుదల అయ్యి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో పులి జోష్ మీద ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. వరుసగా 'భరత్ అనే నేను' మరియు 'మహర్షి' లాంటి రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో హ్యాట్రిక్ విజయం తన ఖాతాలో పడటంతో మహేష్ బాబు సంక్రాంతి 'సరిలేరు నీకెవ్వరు' సక్సెస్ నీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. సినిమా విడుదల అయిన నాటి నుండి పాజిటివ్ టాక్ తో స్టార్ట్ కావడంతో కలెక్షన్లు అప్పటి నుండి ఇప్పటి దాకా ఎక్కడా డౌన్ కాకుండా రికార్డు స్థాయిలో కలెక్షన్లు కలెక్ట్ చేయడంతో మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ కలెక్షన్ కొల్లగొట్టిన సినిమాగా సరిలేరు భవిష్యత్తులో రికార్డ్ క్రియేట్ చేయనున్నట్లు సమాచారం.

 

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మహేష్ బాబు ఓపెన్ గా ఓ విషయం గురించి మాట్లాడినా దానికి సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ కూడా మెచ్చుకుంటున్నారు. మేటర్ లోకి వెళ్తే వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో నటించిన మహర్షి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత వెంటనే సుకుమార్ సినిమా మొదలు పెట్టాలని మహేష్ ఫిక్స్ అయ్యారట. అటువంటి తరుణంలో మహర్షి సినిమా ప్రాజెక్ట్ చేస్తున్న టైంలో అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమాకి సంబంధించి 40 నిమిషాల కథ చెప్పడంతో అంతా ఓకే చేసి మరుసటి యేడాది చేద్దామని అనిల్ రావిపూడి చెప్పారట.

 

అయితే ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అనిల్ రావిపూడి వెంకటేష్ తో తీసిన ఎఫ్ 2 సినిమా తన కుటుంబ సభ్యులతో కలిసి చూస్తున్న తరుణంలో తన పాప సితార సినిమా చూస్తున్నంత సేపు పడి పడి నవ్వడం తో ఆ టైం లోనే నాలో స్వార్థం మొదలైంది వెంటనే అనిల్ రావిపూడి తో సినిమా చేయాలని అని చెప్పి సినిమాని చేయడం జరిగిందని సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందని తన స్వార్థం వల్లే సుకుమార్ తో చేయాల్సిన ప్రాజెక్ట్ ని పక్కన పెట్టినట్లు మహేష్ ఒప్పుకోవడం జరిగింది. ఇంకా చాలామంది సోషల్ మీడియాలో నెటిజన్లు చాలా పెద్ద కాంట్రవర్సీ అయిన ఇష్యూ ని ఇంత క్లారిటీగా ఓపెన్ గా ఒప్పుకోవటం లో మహేష్ బాబుని మించిన హీరో మరొకరు లేరని తెగ పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: