ఈ సంక్రాంతికి వచ్చిన స్టార్ సినిమాల వసూళ్లు అదిరిపోయాయి. మహేష్ సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో రెండు సినిమాలు మంచి వసూళ్లతో దూసుకెళ్తున్నాయి. డైరక్టర్ అనీల్ రావిపుడి, త్రివిక్రం ఇద్దరు తమ సత్తా చాటారు. పటాస్ నుండి ఎఫ్-2 వరకు వరుస సక్సెస్ లను అందుకున్న అనీల్ రావిపుడి సరిలేరు నీకెవ్వరు సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక త్రివిక్రం కూడా తన స్టామినా ఏంటో ప్రూవ్ చేశాడు. 

 

సంక్రాంతి పండుగకి ఎక్కువ హాలీడేస్ ఉండటం వల్ల ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా సినిమాలు చూసే అవకాశం ఉంటుంది. ఈ సంక్రాంతికి వచ్చిన మహేష్, అల్లు అర్జున్ సినిమాలు రెండు మంచి హిట్ కాగా ఈ ఇద్దరు కొద్దిపాటి గ్యాప్ తో తర్వాత సినిమాలతో బిజీ అవనున్నారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం హీరోల మధ్య పోటీ ఎలా ఉన్నా నెక్స్ట్ సంక్రాంతికి మళ్లీ అనీల్ వర్సెస్ త్రివిక్రం మధ్య పోటీ ఉంటుందని తెలుస్తుంది. 

 

సరిలేరు సక్సెస్ జోష్ లో ఉన్న అనీల్ రావిపుడి తన నెక్స్ట్ సినిమా ప్లాన్ లో ఉన్నాడు ఆల్రెడీ దిల్ రాజు బ్యానర్ లో ఎఫ్-3 చేసేందుకు రెడీగా ఉన్న అనీల్ సమ్మర్ లో సినిమా స్టార్ట్ చేసి 2021 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఇక త్రివిక్రం కూడా అల వైకుంఠపురములో సినిమా తర్వాత ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరిలో ఒకరితో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఆ సినిమా కూడా 2021 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. అంటే త్రివిక్రం అనీల్ రావిపుడి సంక్రాంతి సినిమాల పొటీ ఇలా కొనసాగుతుందని చెప్పొచ్చు.  అయితే వచ్చే ఏడాది కూడా ఈ ఇయర్ లానే ఇద్దరు సూపర్ హిట్లు కొడతారా లేదా అసలు ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో త్వరలో తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: