బాలకృష్ణ చేసిన గత మూడు సినిమాలు దారుణంగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అవడంతో నందమూరి అభిమానులు తీవ్ర స్థాయిలో బాలకృష్ణ సెలెక్ట్ చేసుకున్న సినిమాల పట్ల విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుత జనరేషన్ కి అలరించే సినిమా బాలకృష్ణ చెయ్యాలని యాక్టింగ్ లో కూడా కొత్తదనం చూపించాలి అంటూ నందమూరి అభిమానులు కోరుతున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ రెండు సినిమాల తర్వాత ఇటీవల కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నటించిన 'రూలర్' సినిమా దారుణంగా ఫ్లాప్ కావడంతో బాలకృష్ణ తర్వాత చేయబోయే బోయపాటి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

ఇదే తరుణంలో డైరెక్టర్ బోయపాటి కూడా తన చివరి సినిమా వినయ విధేయ రామ దారుణంగా ఫ్లాప్ అవడంతో తన టీం మొత్తం చేంజ్ చేసినట్లు సమాచారం. ఇటువంటి నేపథ్యంలో బాలకృష్ణ గతంలో 'సింహ' మరియు 'లెజెండ్' లాంటి సినిమాలు తెరకెక్కించి అద్భుతమైన విజయాలు సాధించడంతో తాజాగా తీయబోయే మూడో సినిమా తో కచ్చితంగా హ్యాట్రిక్ విజయం సాధించాలని కథ మరియు సినిమాలో చేయబోయే పాత్రల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు బోయపాటి. ఇటువంటి తరుణంలో ఈ సినిమాలో బోయపాటి బాలకృష్ణ కు విలన్ పాత్రలు మెగా బ్రదర్ నాగబాబు తో చేయించడానికి రెడీ అవుతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.

 

అసలు మామూలుగా ఈ క్యారెక్టర్లో గతంలో రాజశేఖర్ చేత చేయించాలని బోయపాటి అనుకున్నారట కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల మెగా బ్రదర్ నాగబాబు చేత బోయపాటి చేయించడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో వినపడుతున్న టాక్. గతంలో నాగబాబు మరియు బాలకృష్ణ మధ్య సోషల్ మీడియాలో మనస్పర్ధలు రావడం జరిగింది ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వీరిద్దరి మధ్య గొడవ సద్దుమణిగినట్లు ఈ నేపథ్యంలోనే నాగబాబు తెలుగుదేశం పార్టీ వైజాగ్ లో చేపట్టిన ఇసుక దీక్షలో పాల్గొనడం జరిగిందని...దీంతో బోయపాటి దర్శకత్వంలో బాలయ్య బాబు చేయబోయే సినిమాలో విలన్ పాత్రలో నాగబాబు నటించే ఛాన్స్ ఉన్నట్లు గాసిప్ వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: