టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఈశ్వర్ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, తొలి సినిమాతోనే మంచి సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఆ తరువాత మూడవ సినిమాగా రిలీజ్ అయిన వర్షం సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన ప్రభాస్, ఇక అక్కడినుండి ఒక్కొక్కటిగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ హీరోగా మెల్లగా ఒక్కొక్కమెట్టు ఎక్కుతూ ముందుకు సాగాడు. ఛత్రపతి, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టిన ప్రభాస్, ఆ తరువాత టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు భాగాల సూపర్ సక్సెస్ తో దేశవ్యాప్తంగా బాలీవుడ్ హీరోల రేంజ్ క్రేజ్, ఫాలోయింగ్ ని దక్కించుకున్నాడు. 

 

ఇక ఇటీవల సాహో అనే భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్, ఆ సినిమా ఫెయిల్యూర్ తో కొంత ఆలోచనలో పడ్డాడని చెప్పాలి. ఇక ప్రస్తుతం పూజ హెగ్డే హీరోయిన్ గా, జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ అనే సినిమాలో నటిస్తున్న ప్రభాస్, ఎలాగైనా ఆ సినిమాతో సూపర్ హిట్టాలనే దృఢ నిశ్చయంతో ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇకపోతే నిన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు 80 వ జన్మదిన వేడుకలను హైదరాబాద్ లోని ఫిలిం నగర్ క్లబ్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఫ్యాన్స్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుకల అనంతరం కృష్ణంరాజు మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ, బాహుబలి సినిమాతో ప్రభాస్ కు దేశ, విదేశాల్లో విపరీతమైన పేరు ప్రఖ్యాతలు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని, అలానే ఇటీవల వచ్చిన సాహో సినిమా

 

ప్రభాస్ రేంజ్ ని మరింతగా పెంచిందని అన్నారు. ఇకపోతే ప్రస్తుతం తమ గోపికృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ బ్యానర్ తో కలిసి నిర్మిస్తున్న ప్రభాస్ జాన్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోందని, ఒక మంచి లవ్ స్టోరీగా ఎంతో భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న ఈ సినిమాని 2021 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని, అలానే ఈ సినిమాలో తాను కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నానని కృష్ణం రాజు తెలిపారు. దీనితో ప్రభాస్ నుండి ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రాదని తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే వచ్చే ఏడాది రిలీజ్ కాబోయే జాన్ సినిమా తప్పకుండా మంచి సక్సెస్ సాధించి ప్రభాస్ కు మంచి పేరు తీసుకురావాలని వారు కోరుకుంటున్నారు.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: