ఒకరిమీద కోపం మరొకరి మీద చూపించే విధంగా ‘సరిలేరు నీకెవ్వరు’ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోవడానికి కారకుడు బండ్ల గణేష్ అంటూ ఇప్పుడు లేటెస్ట్ గా మహేష్ కి జ్ఞానోదయం అయింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో వచ్చే ట్రైన్ కామెడీ ఎపిసోడ్ లో బ్లేడ్ గణేష్ గా ఎంటర్ అయిన బండ్ల గణేష్ కామెడీ పెద్దగా వర్కౌట్ కాని నేపధ్యంలో ఆ కామెడీ సీన్స్ ను కట్ చేస్తే బాగుంటుంది అంటూ కొందరు మహేష్ కు సూచనలు ఇవ్వడంతో ఈ విషయమై మహేష్ దర్శకుడు అనీల్ రావిపూడి తో చర్చలు జరుపుతున్నట్లు టాక్. 

వాస్తవానికి ఒక టాప్ హీరో సినిమాకు సంబంధించి డివైడ్ టాక్ వచ్చినప్పుడు ఆ సినిమాను కలక్షన్స్ పరంగా రక్షించడానికి ఆ సినిమా నిడివి పెంచిన అనవసరపు సీన్స్ కట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల పెద్దగా ఫలితం ఉండదు. ఒకసారి సగటు ప్రేక్షకుడు ఒక సినిమా పై నిర్ణయం తీసుకున్న తరువాత ఆ సినిమాలో ఆ తరువాత ఎన్ని మార్పులు చేసినా ప్రేక్షకులు పట్టించుకోరు.

వాస్తవానికి ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీకి డివైడ్ టాక్ రావడానికి ఆ మూవీలోని కథ గురించి కాకుండా అనీల్ రావిపూడి కామెడీ మార్క్ సీన్స్ పై ఎక్కువగా ఆశలు పెట్టుకోవడం. సాధారణంగా మహేష్ తాను నటించిన సినిమాకు సంబంధించి ఒక టాక్ ఏర్పడిన తరువాత ఆ టాక్ ను మార్చడానికి పెద్దగా ప్రయత్నాలు చేయడు. 

అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి రేస్ విన్నర్ అని చెప్పడానికి మహేష్ పడుతున్న కష్టం అతడి తీరులో వచ్చిన మార్పును స్పష్టంగా తెలియచేస్తోంది. ఇది ఇలా కొనసాగుతూ ఉంటే నిన్న అమెరికాలో వీకెండ్ రోజు కావడంతో ‘అల వైకుంఠపురములో’ 185కె కలక్షన్స్ వసూలు చేస్తే ‘సరిలేరు నీకెవ్వరు’ కేవలం 34కె తో సరిపెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ‘సరిలేరు’ పై ‘అల’ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది అన్న విషయం క్లారిటీ వస్తోంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: