ప్రస్తుతం సమంత తాను నటించే సినిమాల సంఖ్యను తగ్గించుకుని చైతన్యను మాస్ హీరోగా సెటిల్ చేయాలని చాల తాపత్రయ పడుతోంది. దీనికోసం చైతన్యకు మాస్ ఇమేజ్ ఇవ్వగల దర్శకుల కోసం కథల కోసం సమంత వేట కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితులలో చైతన్యను తిరస్కరించి శర్వానంద్ కు సమంత ఓటు వేయడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

‘ఆర్ ఎక్స్ 100’ మూవీ విడుదలైన తరువాత ఆ మూవీ దర్శకుడు అజయ్ భూపతి చాల బిజీ డైరెక్టర్ గా మారిపోతాడు అని చాలామంది భావించారు. అయితే ఈ డైరెక్టర్ కు కాలం కలిసి రాలేదు. దీనితో అతడు మరింత ఆలోచనలు చేసి రూపొందించిన ‘సముద్రం’ మూవీ స్క్రిప్ట్ ను పుచ్చుకుని ముందుగా నాగచైతన్య వద్దకు వెళ్ళిన విషయం తెలిసిందే.

ఈ స్క్రిప్ట్ విని చైతన్య మోజు పడటంతో ఈ మూవీలో ఒక ప్రత్యేక పాత్రను సమంత చేత చేయించాలని ప్రయత్నాలు చేసారు. అయితే ఈ ప్రయత్నాలకు సమంత నో చెప్పడమే కాకుండా నాగచైతన్యకు కూడ ఈ మూవీ కథ సరిపోదు అంటూ చైతన్య మనసును మార్చేసింది. 

దీనితో అజయ్ భూపతి రవితేజా ఇలా చాలామంది హీరోల చుట్టూ తిరిగి చివరకు శర్వానంద్ ను ఈ మూవీ కథకు ఒప్పించగలిగాడు. శర్వానంద్ ప్రస్తుతం సమంతతో ‘జాను’ చేస్తున్న నేపధ్యంలో ఈకథలో తాను నటిస్తున్న విషయం సమంతకు చెప్పి ఆమెను ఈ మూవీలో ప్రత్యేక పాత్రను చేయడానికి ఒప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పడు ఈ వార్తలు వైరల్ కావడంతో సమంతను ఏ విషయం చెప్పి శర్వానంద్ ఒప్పించాడు అంటూ చాలామంది ఆశ్చర్యపడుతున్నారు. మరి కొందరైతే చైతన్యకు లేని సమర్ధత శర్వానంద్ కు ఉందా అంటూ జోక్స్ వేస్తున్నారు. దీనితో అజయ్ భూపతి కష్టాలు శర్వానంద్ తీర్చి తిరిగి ఈ దర్శకుడి కెరియర్ కు మరొక టర్నింగ్ పాయింట్ ఇస్తున్నాడు అనుకోవాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: