టాలివుడ్ లో ఒక్కసారి అగ్ర హీరో పక్కన సినిమా చేస్తే చాలు ఆ హీరోయిన్ కి వచ్చే గుర్తింపు అంతా ఇంతా కాదు. నటన లేకపోయినా సరే గ్లామర్ తో ఆమె కెరీర్ ఊపందుకుంటుంది. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. చాలా మంది హీరోయిన్లు తెలుగులో ఇలా విజయవంతం అయిన వాళ్ళే కావడం విశేషం. పదుల కొద్ది సినిమాలు చేసినా సరే రాని గుర్తింపు కొందరు హీరోయిన్లకు వస్తుంది. ఆ జాబితాలో పూజా హెగ్డే ముందు వరుసలో ఉంటుంది. చేసినవి తక్కువ సినిమాలే అయినా సరే మంచి గుర్తింపు వచ్చింది.

 

అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి హీరోలతో సినిమాలు చేసింది ఈ భామ. ఇప్పుడు మరోసారి అల్లు అర్జున్ తో నటిస్తుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన‌ అల వైకుంఠపురం సినిమాలో పూజ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో కూడా ఆమెకు మంచి పేరు వ‌చ్చింది. ఈ నేపధ్యంలో ఇప్పుడు ఒక వార్త హల్చల్ చేస్తుంది. పూజ కోసం త్రివిక్రమ్ కథలు రాసుకుంటున్నాడని టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. 

 

అరవింద సమేతతో పాటు ప్రస్తుతం చేస్తున్న సినిమాకు త్రివిక్రమ్ ఆమెకు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత చేసే సినిమాలో కూడా ఆమెనే తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. త్రివిక్రమ్ ఆమెలోని నటిని కూడా బయటకు తీసుకురావాలని భావిస్తున్నాడట. అందుకోసం ఆమెకు పవర్ ఫుల్ పాత్రలు ఇవ్వాలని భావిస్తున్నాడట. ఆమెనే త‌న త‌ర్వాతి సినిమాల్లో హీరోయిన్‌గా ఉండాల‌ని బ‌లంగా డిసైడ్ అయిపోయాడ‌ట‌.

 

గ్లామర్ లోనే కాదు నటనలో కూడా పూజని హైలెట్ చెయ్యాలని భావిస్తున్నాడట. త‌న తర్వాతి సినిమాల్లోనూ ఆమెకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్న త్రివిక్రమ్ ఇదే విషయాన్ని నిర్మాతలకు కూడా చెప్పాడట. మరి ఆమె కోసం ఎలాంటి పాత్రలు రాస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: