టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా
సినిమా సరిలేరు నీకెవ్వరు
సంక్రాంతి కానుకగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి తొలిరోజు ఒకింత మిశ్రమ స్పందనను రాబట్టింది. అయితే
సూపర్ స్టార్ మహేష్ చాలా గ్యాప్ తరువాత మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ లో నటించడంతో పాటు
మహేష్ స్టార్ పవర్,
సంక్రాంతి సెలవలు, అలానే సరిగ్గా థియేటర్స్ లభ్యత వెరసి ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ లభించేలా చేసాయి. ఇకపోతే ఇప్పటికే మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో కూడా మంచి కలెక్షన్స్ రాబడుతున్న ఈ సినిమాకు తొలివారం రూ.100 కోట్లకు పైగా షేర్ లభించింది.
యువ సక్సెస్ఫుల్
డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో
మహేష్ బాబు ఒక
ఆర్మీ మేజర్ గా నటించగా,
రష్మిక మందన్న మంచి ఎంటర్టైనింగ్ రోల్ లో నటించి ఆకట్టుకుంది.
ఇక
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక పవర్ ఫుల్ రోల్ లో నటించగా విలక్షణ నటుడు
ప్రకాష్ రాజ్ విలన్ గా నటించి మెప్పించారు. అదిరిపోయే విజువల్స్, సాంగ్స్, ఫైట్స్, యాక్షన్,
కామెడీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు
సూపర్ స్టార్ మహేష్ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్ కు థియేటర్స్ కు వస్తున్న
ఆడియన్స్ ఎంతో థ్రిల్ అవుతున్నారు. ఇకపోతే ఈ
సినిమా నిన్నటితో రిలీజ్ అయి 8 రోజలు పూర్తి చేసుకుంది. కాగా ట్రేడ్ విశ్లేషకుల నుండి అందుతున్న లెక్కల ప్రకారం ఈ
సినిమా, 8 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా రూ. 112.03 కోట్ల షేర్ ని కొల్లగొట్టి ఇంకా చాలా ప్రాంతాల్లో మంచి కలెక్షన్ రాబడుతోందని తెలుస్తోంది. అయితే ఓవర్సీస్ లో మాత్రం ఈ
సినిమా ఆశించిన విధంగా రాబట్టడం లేదని, రేపు సోమవారం నుండి ఈ సినిమాకు వచ్చే కలెక్షన్ ని బట్టి ఓవరాల్ గా
సినిమా స్టామినా ఏంటి అనేది తెలుస్తుందని అంటున్నారు. ఇక ఈ
సినిమా 8 రోజుల కలెక్షన్ లెక్కలు ఇలా ఉన్నాయి....!!
నైజాం - 29.8cr
సీడెడ్ - 13.25cr
గుంటూరు - 8.51cr
ఈస్ట్ - 9.04cr
వెస్ట్ - 6.02cr
నెల్లూరు - 3.32cr
తమిళనాడు - 1 Cr
రెస్ట్ ఆఫ్ ఇండియా - 1.5 Cr
ఓవర్సీస్ - 7.85 Cr
రెస్ట్ ఆఫ్ వరల్డ్ - 2.5 Cr
ఓవరాల్ గా మొత్తం షేర్ - 112.03