గత రెండు సంవత్సరాలుగా ఊరిస్తూ వస్తున్న రామ్ చరణ్, ఎన్టీఆర్ ల భారీ మల్టీ స్టారర్ మూవీ షూటింగ్ ముగింపు దశకు వచ్ిచనట్టే అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అనధికారికంగా చెబుుతన్నారు. రాజమౌళి గతంలో ప్రకటించిన జులై 30వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు తీవ్రంగా కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి సినమా అంటేనే భారీతనంకు పెట్టింది పేరు అన్నట్టుంగా ఉంటుంది. ఇక జక్కన్న ప్రతీ సినిమాలో కూడా ఇంటర్వెల్ ముందు సీన్స్ ఒల్లు గగుర్పొడిచే విధంగా ఉంటుంది. 


జక్కన్న గత చిత్రాల మాదిరిగా ఈ చిత్రంలో కూడా అద్భుతమైన ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్ ఉండబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు, కొమురం భీం పాత్రల్లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. వారిద్దరూ కలిసి అంటే అల్లూరి, కొమురం భీంలు కలిసి బ్రిటీష్ వారిపైకి యుద్ధంకు వెళ్తారట. బ్రిటీష్ వారిని మట్టికరిపించడంతో ఇంటర్వెల్ పడుతుందట. 

 

ఇంటర్వెల్ కు ముందు ఉండే ఈ 20 నిమిషాల భీకర యుద్ధ సన్నివేశాల్లో అల్లూరి పాత్రలో చరణఅ, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ ను చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించేలా ఉంటారట. ఆ సీన్స్ లో వీరిద్దరి నటన, రౌద్రం సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. మొత్తానికి ఆర్ఆర్ఆర్ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఆ యుద్ధ సన్నివేశం తర్వాత ఇంటర్వెల్ పడుతుందట. ఈ చిత్రం గురించి ప్రతి రోజు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వస్తూ సినిమా అంచనాలను పెంచుతూనే ఉంది. ఇప్పుడు ఇంటర్వెల్ యుద్ధ సన్నివేశం అంటూ వస్తున్న ఈ వార్తలు సినిమాపై అంచనాలను పీక్స్ కు తీసుకెళ్తుంది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. జక్కన్న ఏ సీన్ ను ఎలా చిత్రీకరిస్తాడో అన్న ఉత్కంఠ సగటు ప్రేక్షకుడిలో నెలకొంది. అన్ని కుదిరితో జులైలో వస్తుందన్న సినిమా వర్గాల సమాచారం సినీ అభిమానుల్లో ఒకింత క్యూరియాసిటీని పెంచుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: