టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల క్రితం తన కెరీర్ 25వ సినిమాగా వచ్చిన అజ్ఞాతవాసి తో సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టారని చెప్పాలి. అయితే త్రివిక్రమ్ దర్శకత్వం లో వచ్చిన ఆ సినిమా ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాకపోవడంతో పవన్ నుండి ఆయన ఫ్యాన్స్ మరొక సినిమా కావాలని ఎప్పటినుండో కోరుతూ వస్తున్నారు. కాగా అజ్ఞాతవాసి తరువాత పూర్తిగా రాజకీయాల్లో నిమగ్నమైన పవన్, ఎట్టకేలకు ఫ్యాన్స్ కోరికను మన్నించడం జరిగింది. అతి త్వరలో బాలీవుడ్ రీమేక్ మూవీ పింక్ తెలుగు వర్షన్లో నటించనున్న పవన్, ఆ సినిమా కోసం తన మేకోవర్ లో కొన్ని మార్పులకు ప్రయత్నిస్తున్నారు. 

 

ఇకపోతే ఈ సినిమా తరువాత పవన్, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లుగా కొద్దిరోజుల నుండి పలు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవల పవన్ ని కలిసిన క్రిష్, ఒక పీరియాడికల్ స్టోరీ ని వినిపించారని, అయితే పింక్ రీమేక్ అయిన తరువాత ఆ సినిమా చేద్దాం అని క్రిష్ కు మాటిచ్చారట. అయితే ప‌వ‌న్‌తో క్రిష్ చేసే సినిమాలో విలన్ పాత్రలో ఆంధ్రలోని ఓ కీలక రాజకీయ నాయకుడి ఛాయలు వుండేలా చూస్తున్నట్లు తెలుస్తోంది. విలన్ పాత్రలో ఆంధ్రలోని జనాల అభిమాన నాయకుడి షేడ్స్ చేర్చుతుండడంతో, అందుకోసం ఇక్కడి నటులను కాకుండా బాలీవుడ్ నటుడిని తీసుకుంటే బెటర్ అని కూడా ఆలోచనలు సాగుతున్నట్లు తెలుస్తోంది. 

 

కొంద‌రు మాత్రం సోష‌ల్ మీడియాలో జ‌గ‌న్‌ను టార్గెట్ చేసేలా ఈ సినిమా ఉంటుంద‌ని గుస‌గుస‌లాడుకుంటున్నారు. మంచి పవర్ఫుల్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఆ సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉండనుందని, గతంలో క్రిష్ తీసిన గమ్యం, వేదం, కృష్ణం వన్డే జగద్గురుమ్, గౌతమి పుత్ర శాతకర్ణి, కంచె మాదిరిగా ఈ సినిమా కూడా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంటున్నారు. అయితే ఈ సినిమా విషయమై జరుగుతున్న ప్రచారంలో అస‌లు నిజాలు బయటకు రావాలంటే ఈ సినిమా వ‌చ్చే వ‌ర‌కు చూడాల్సిందే. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన కూడా వెలువడాల్సి ఉంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: