సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన నటించింది . ఇక ఈ సినిమా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటినుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసిన ఈ సినిమా... విడుదలైన తర్వాత కూడా ప్రేక్షకుల అంచనాలకు చేరువ అయ్యింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోయింది ఈ సినిమా. సూపర్ స్టార్ మహేష్ బాబు ఖాతాలో మరో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది సరిలేరు నీకెవ్వరు సినిమా. ఈ సినిమాలో అద్భుతమైన కామెడీతో మహేష్ బాబు ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించారు. 

 

 

ఇక ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటు... భారీ వసూళ్లు రాబడుతోంది ఈ సినిమా. ఈ సినిమాకు సంక్రాంతి సెలవులు తోడవడంతో భారీ వసూళ్లు ఈ సినిమా సొంతమై నిర్మాతలకు లాభాల  పంట పండింది . ఇకపోతే మహేష్ బాబుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కు మధ్య ఉన్న స్నేహం  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహేష్ బాబు సినిమాలు చూసి...కేటీఆర్ మహేష్ పై  ప్రశంసలు కురిపించిన సినిమాలు ఎన్నో  ఉన్నాయి. ఏకంగా భరత్ అనే నేను సినిమా విడుదల సందర్భంగా మహేష్ బాబు కేటీఆర్ కలిసి ఇంటర్వ్యూ కూడా చేశారు.ఇక సరిలేరు నీకెవ్వరూ  సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ కి హాజరైన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాని కేటీఆర్ చూశారా అనే ప్రశ్న అడిగారు. ఆయన ఇంకా సినిమా చూడలేదు చూశాక తప్పకుండా ఫీడ్ బాక్ ఇస్తారు అంటూ మహేష్ బాబు చెప్పుకొచ్చారు. 

 

 

 ఇంకో ప్రశ్నగా మీ ఆప్తమిత్రుడు కొన్ని రోజుల్లో ముఖ్యమంత్రి అవుతాడు అంటూ చెబుతున్నారు.. కేటీఆర్ ని ఎప్పుడు సీఎం కుర్చీ లో చూడవచ్చు అని ప్రశ్నించగా... మహేష్ బాబు తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు. నాకేం తెలుసు మా మధ్య సినిమాలు తప్ప నో పాలిటిక్స్ రాజకీయాలంటే నాకు కొంత కూడా తెలియదు అంటూ చెప్పుకొచ్చారు మహేష్ బాబు. ఇకపోతే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాకు ప్రమోషన్స్ పూర్తిచేసి కుటుంబంతో హాలిడే ట్రిప్ కోసం దుబాయ్ ప్రయాణమయ్యారు. కాగా  మహేష్  తర్వాతి సినిమా వంశీ పైడిపల్లితో చేయనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: