జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాల మీద మళ్ళీ దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన గత ఏడాది అజ్ఞాతవాసి సినిమా తర్వాత సినిమాల మీద ఆసక్తి చూపించలేదు. రాజకీయాల్లోకి వెళ్ళినా అక్కడ కూడా పెద్దగా ప్రభావం చూపించని సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మళ్ళి పింక్ రీమేక్ ద్వారా సినిమాలు చెయ్యాలని పవన్ కళ్యాణ్ పట్టుదలగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పటికే ఓకే చెప్పిన పవన్ కళ్యాణ్, ఫిబ్రవరి నుంచి షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి.

 

నిర్మాత దిల్ రాజు బ్యాన‌ర్లో ఈ సినిమా తెర‌కెక్క నున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇక్కడ టాలీవుడ్ లో ఒక నిర్మాత పవన్ తో సినిమా చేసేందుకు కొన్ని రోజుల నుంచి ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. ఆయన అనుకున్నదే తడవుగా త్రివిక్రమ్ ని కలిసి అడిగారట. దీనితో త్రివిక్రమ్ వెంటనే ఆయనకు సమాధానం కాస్త ఘాటుగా చెప్పారట. చుట్టం చూపుకి పవన్ ఇంటికి వెళ్తే నాలుగు గారెలు తిని వస్తాను, స్నేహం తో వెళ్తే ఆయన ఇంట్లో పిల్లలతో ఆడుకుని వస్తాను గాని సినిమా మాత్రం చేసేది లేదని స్పష్టంగా చెప్పారట.

 

దానికి కారణం కూడా ఆయన చెప్పారట. పవన్ తో సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా తనకు పెద్దగా నష్టం లేదని, కాని ఆ అభిమానుల తిట్లు మాత్రం తాను పడలేను అని చెప్పెసారట ఆయన. అజ్ఞాతవాసి సినిమాను అరవింద సమేత సినిమా కోసం ఫ్లాప్ చేశాను అని తనకు కులాన్ని పవన్ అభిమానులు అంట గట్టి సోషల్ మీడియాలో నానా మాటలూ అన్నారని, సినిమా ఫ్లాప్ అయితే నేను ఆ తిట్లు పడలేను అని చెప్పెసారట. గతంలో పవన్ కి కూడా ఇదే విషయాన్ని త్రివిక్రమ్ చెప్పినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మ‌రి ఈ విష‌యం సినిమా మీడియా స‌ర్కిల్స్‌లో బాగా వైర‌ల్ అవుతోంది.. ఇందులో నిజా నిజాలు ఏంటో వాళ్ల‌కే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: