పవన్ కళ్యాణ్ నుండి రేణు దేశాయ్ విడిపోయి కొన్ని సంవత్సరాలు గడిచిపోయినా పవన్ అభిమానులకు మాత్రం ఆమె ఇప్పటికీ వారికి ‘వదిన’ ఈమధ్య కాలంలో సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న రేణు ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టడమే కాకుండా ఆ విషయానికి సంబంధించిన ఫోటోను కూడ షేర్ చేయడంతో ఇప్పుడు ఆ ఫోటో పవన్ అభిమానుల మధ్య వైరల్ గా మారింది. 

ఈమధ్య రేణు దేశాయ్ ఒక షూటింగ్ పని నిమిత్తం వేరే ఊరు వెళ్ళి బాగా పొద్దుపోయిన తరువాత తిరిగి హైదరాబాద్ వస్తున్నప్పుడు ఆమెకు ఒక అనుకోని సంఘటన ఎదురైందట. ఆమె ప్రయాణిస్తున్న కారు ఆ గ్రామాన్ని దాటితే హైదరాబాద్ నగరంలోకి అడుగు పెట్టే వేళ ఆమె కారుకు పంక్చర్ అయిందట. అయితే అప్పటికే అర్థరాత్రి కావడంతో ఆ సమయంలో కారు దిగిన ఆమెను కొందరు గుర్తించడమే కాకుండా రేణు దేశాయ్ ని చూసి ఆశ్చర్యపడటమే కాకుండా ఆమె కారు రిపేరు అయ్యేలోగా 
ఆ గ్రామస్థులు తమకు ఉన్నదాన్లోనే చూసుకొని ఉప్మా వండి పెట్టటమే కాదు టీ కాచి పెట్టారట. అంతేకాదు చలిమంట కూడా వేశారట. 

దీనితో వారి అభిమానానికి చెలించి పోయిన రేణు ‘ఎంత డబ్బు ఉండి ఏం లాభం.. వారి నుంచి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది’ అంటూ కామెంట్ పెట్టి ఆ గ్రామంలో ఆ రాత్రి ఒక నులక మంచం పై సేద తీరుతున్న విషయాన్ని షేర్ చేసింది. వాస్తవానికి రేణు దేశాయ్ ని భాగ్యనగరం దగ్గరలో పల్లెటూరులో ఉన్న పవన్ వీరాభిమానులు అని తెలుస్తోంది.

పవన్ ఇమేజ్ నుండి దూరం జరిగి తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకోవాలని రేణు భావిస్తూ ఉంటే ఇప్పటికీ ఆమెను పవన్ భార్యగానే ఆమెను ఆ ఊరి ప్రజలు గుర్తించడం షాక్ ఇచ్చే విషయం. ఈ విషయాలు పవన్ దృష్టి వరకు కూడ వెళ్ళడంతో పవన్ షాక్ గురై నవ్వుకున్నాడని తెలుస్తోంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: