సంక్రాంతి సీజన్ ముగిసింది. ఈ సీజన్ కు వచ్చిన సినిమాల సందడి కూడా ముగిసింది. వచ్చిన నాలుగు సినిమాల్లో అల.. వైకుంఠపురములో బ్లాక్ బస్టర్, సరిలేరు నీకెవ్వరు సినిమా హిట్, దర్బార్ సినిమా బిలో యావరేజ్, ఎంత మంచివాడవురా సినిమా ఫ్లాప్ టాక్ తో రన్ అవుతున్నాయి. వీరిలో మహేశ్ బాబు సినిమా సినిమాకు గ్యాప్ ఇచ్చే విషయం మనకు తెలిసిందే. కొన్నేళ్లుగా పరిశీలిస్తే ఓ సినిమా పూర్తవగానే ఫ్యామిలీతో సహా ఫారిన్ వెళ్లిపోతూంటాడు.
కొత్త సినిమా మొదలుపెట్టేలోపు ఫ్యామిలీతో గడపడం మహేశ్ కు అలవాటు. ప్రస్తుతం ఇదే ఫాలో అయ్యాడు మహేశ్. సరిలేరు.. ధియేటర్లలో రన్ అవుతూండటంతో ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ కు బయలుదేరాడు. మహేశ్, నమ్రత, కొడుకు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి వెకేషన్ కు బయలుదేరాడు. ఇందుకు సంబంధించిన పిక్స్ ను నమ్రత తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ‘సెలవులకు బయలుదేరుతున్నాం.. సందడి చేసుకోవాల్సిన నిజమైన సమయం.. బ్లాక్ బస్టర్ కా బాప్, సరిలేరు నీకెవ్వరు’ అంటూ మెసేజ్ రాసుకుంది. వీరితోపాటు మహేశ్ స్నేహితుడు మెహర్ రమేశ్ కూడా వెళ్లారు. వీరంతా ఓ రెండు నెలల పాటు అమెరికాలో గడుపుతారని సమాచారం.
మహేశ్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ హీరోగా కొనసాగిన సమయంలో ఆయన తన కుటుంబానికి తగిన సమయం కేటాయించేవారు కారని మహేశ్ ఎన్నోసార్లు చెప్పారు. కృష్ణ కూడా అలుపెరగకుండా సినిమాలు చేసారని అంటారు. అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా మహేశ్ తానెంత బిజీగా ఉన్నా కుటుంబానికి అధిక ప్రాధాన్యమిస్తూంటాడు. అందులో భాగంగానే సినిమా సినిమాకు మధ్య ఇలా హాలిడే ట్రిప్స్ కు వెళ్తూంటాడు. తిరిగొచ్చాక వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కొత్త సినిమాలో నటించనున్నాడు సూపర్ స్టార్ మహేశ్.
View this post on InstagramAnd we r off!! #happy holidays 💕💕a well deserved one ❤️❤️❤️#blockbusterkabaap #sarileruneekevvaru