సాదారణంగా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినట్టే వచ్చి అనుకోని కారణాల వల్ల రిజక్ట్ అవుతుంటాయి.. మరికొన్ిన సార్లు అనుకోని కారణాల వల్ల తప్పుకోవాల్సి వస్తుంది. తాజాగా ఇలాంటి పరిస్థితే ఇప్పుడు కీర్తి సురేష్ కి వచ్చిందని అంటున్నారు.  ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగాన్ ‘తానాజీ’ మూవీతో బంపర్ హిట్ అందుకున్నారు.  ఈ మూవీతో దాదాపు రెండు వందల కోట్ల క్లబ్ లోకి చేరువలో ఉందని వార్తలు వస్తున్నాయి.  ఈ మూవీ తర్వాత ప్రస్తుం మైదాన్ అనే మూవీలో నటిస్తున్నారు. సయ్యద్ రహీం అనే ఫుడ్ బాల్ ఆటగాడి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మైదాన్ సినిమాలో అజయ్ దేవగన్ సరసన కీర్తి సురేష్ నటిస్తుందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

 

ఇందుకోసం ఆమె ఫిట్ నెస్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా కీర్తి సురేష్సినిమా నుండి తప్పుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే నిర్మాత బోని కపూర్ తో కీర్తి సురేష్ మాట్లాడి ఈ సినిమా నుండి బయటికొచ్చేసిందంటున్నారు.  ఈ పాత్రకు ఆమె సూట్ కాదని చిత్రయూనిట్ భావించిందని సమాచారం. అజయ్ దేవగన్ భార్య పాత్రలో కీర్తి చాలా తక్కువ వయసు గా ఉన్న అమ్మాయిగా కనబడంతో.. కీర్తి సురేష్ కి అంతగా నచ్చకపోవడంతో.. ఈ సినిమా నుండి తానే తప్పుకుంటున్నట్లుగా బోణీ కపూర్ కి చెప్పినట్టుగా బాలీవుడ్ మీడియా టాక్.

 

అయితే ఆమె ప్లేస్ లో అజయ్ దేవగన్ సరసర దక్షిణాది నటి ‘ప్రియమణి’ నటించనున్నదని తెలుస్తోంది. అయితే ఈ రెండు పాత్రలు ఒకటా కాదా అనేది తెలియాల్సివుంది. ప్రస్తతం బాలీవుడ్ లో వస్తున్న కథనాలే.. అసలు విషయం ఇంకా చిత్ర యూనిట్ అఫిషియల్ గా ప్రకటించలేదు.. మరి ఇది ఎంత వరకు నిజమో అబద్దమో తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: