తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ సినిమాల్లో హీరోయిన్ గా కొన్నాళ్లపాటు రాణించింది ప్రియమణి. పరుత్తివీరన్ అనే తమిళ సినిమాలో ఆమె నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా దక్కింది. ప్రస్తుతం ప్రియమణికి ఓ బాలీవుడ్ ఆఫర్ దక్కినట్టు సమాచారం. అజయ్ దేవగన్ హీరోగా నటించే సినిమాలో నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కినట్టు సమాచారం. మొదట ఈ పాత్రకు మహానటితో జాతీయ ఉత్తమనటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేశ్ ఎంపికైంది. ఇప్పుడీ పాత్ర నుంచి కీర్తి నుంచి ప్రియమణికి దక్కినట్టు బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి.

 

 

ఫుట్ బాల్ క్రీడ నేపథ్యంలో తెరకెక్కుతున్న మైదాన్ సినిమాలో తల్లి పాత్రకు మొదట కీర్తి సురేశ్ ను తీసుకుంది చిత్ర బృందం. కానీ కీర్తి ఆపాత్రలో చిన్నగా కనిపిస్తుందని భావించారట. దాంతో కీర్తిని తప్పించి ప్రియమణిని తల్లి పాత్రకు తీసుకున్నారు. వీరిద్దరూ జాతీయ అవార్డులు పొందిన నటీమణులే కావడం విశేషం. సయ్యద్ అబ్దుల్ రహీమ్ అనే ఫుట్ బాల్ కోచ్ పాత్రలో నటిస్తున్నాడు. కోచ్ సయ్యద్ ఆధ్వర్యంలో 1952 నుంచి 1962 మధ్యలో ఫుట్ బాల్ టీమ్ అప్పట్లో బాగా రాణించింది. 1963 వరకూ ఆయన కోచ్ గానే ఉన్నారు. ప్రియమణి గతంలో చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది.

 

 

నటనతో పాటు గ్లామర్ పాత్రలు, డీ గ్లామర్ పాత్రలు పోషించడంలో ప్రియమణి కరెక్ట్ గా సూటవుతుంది సందేహం లేదు. పూర్తి నటనకు స్కోప్ ఉండే పాత్రను చేయటంలో ప్రియమణి సిద్ధహస్తురాలు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ప్రియమణి కొన్ని రియాలిటీ షోస్ లో పాల్గొంటోంది. బిజినెస్ మేన్ ముస్తఫాను పెళ్లాడి సినిమాలకు కాస్త విరామం ఇచ్చింది ప్రియమణి. 

మరింత సమాచారం తెలుసుకోండి: