మనుషులన్నాక కోరికలు ఉండటం సహాజం. ఆ కోరికలు తీర్చుకోవడం మరొక సాహసం. ఇక ఒక కామన్ మ్యాన్‌గా పుడితే మాక్సిమం మనసులో పుట్టే చిన్న చిన్న కోరికలు తీర్చుకోవచ్చు. అదే ఒక సెలబ్రిటీ విషయానికి వస్తే, తనకున్న పరిధిలోనే జీవించవలసి వస్తుంది. ఎక్కడికైనా వెళ్లితే అభిమానులతో తలనొప్పి అనే భయం వారిని వెంటాడుతూనే ఉంటుంది. ఇందుకు తగ్గట్టుగానే హీరోలు గానీ, హీరోయిన్స్ గానీ మొత్తానికి సినిమా, టీవిలో కనిపించే నటీనటులు గాని ఎక్కడైనా కనిపిస్తే పాపం వారి ప్రైవసీనీ ఎందుకు హరించడం అనే ఆలోచనే లేకుండా బెల్లం చుట్టు ఈగలా ముసురుతారు.

 

 

అందుకే వారి మనసులో పుట్టే చిన్న చిన్న కోరికలను కూడా తీర్చుకోలేక అవకాశం కోసం ఎదురు చూస్తూ వేయిట్ చేస్తుంటారు. ఇకపోతే మాజీ హీరోయిన్ రేణూ దేశాయ్‌ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు ఎదురైన అనుభవాలను తన అభిమానులతో పంచుకుంటూ విపరీతమైన పాపులారిటి సంపాదించుకుంది.. ఇకపోతే తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ పోస్ట్‌ ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అదేమంటే పచ్చని ప్రకృతి మద్య రణగొణ ధ్వనులకు దూరంగా, ప్రశాంతమైన వాతవరణంలో అది పక్కా పల్లెటూళ్లో గడపాలనే కోరిక ఉండేదట.

 

 

అది ఇటీవల తీరిందని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. ఇదెలా తీరిందంటే తాజాగా రేణు సినిమా షూటింగ్‌ ని ముగించుకొని ప్రొడక్షన్ డిజైనర్‌తో కలిసి కారులో ఓ మారుమూల గ్రామం మీదుగా హైదరాబాద్‌కు ప్రయాణిస్తుండగా కనిపించిన ఒక పల్లెటూరు వాతావరణానికి ముగ్దురాలై, తన డిజైనర్‌తో అప్పుడే హైదరాబాద్ వెళ్లిపోవాలని లేదని చెప్పిందట.

 

 

ఆమె అలా చెప్పిందో లేదో సరిగ్గా అదే సమయానికి కారు టైర్‌ పంక్చర్‌ కూడా అవ్వడంతో వెంటనే కారు దిగేసి ఆ ప్రాంతంలో ఉన్న గ్రామస్తుల దగ్గరికి వెళ్లిందట.. రేణూ రాగానే సంబరపడిన గ్రామస్తులు వాళ్లకు తినడానికి ఏమి లేకపోయినా ఆమె కోసం ఉప్మా, టీ ఇవ్వడమే కాదు, చలిగా ఉండటంతో మంట కూడా వేశారట. అలా ఆ రాత్రి రేణు వారితోనే నిద్రపోయిందట. ఈ అనుభవాన్ని రేణూ దేశాయ్‌ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు... 

మరింత సమాచారం తెలుసుకోండి: