ప్రస్తుతం 2020 సంక్రాంతికి సినిమాల సందడి మామూలుగా లేదన్న విషయం  తెలిసిందే.. ఈ సంక్రాంతికి సినిమాల విందు ఫుల్ గా ఉంది.. అందుకే గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సినిమాలు ఎక్కువగా ఉన్నాయి.. ఈసారి ఏకంగా నాలు సినిమాలు బరిలో దిగిన సంగతి తెలిసిందే..

 

 మహేష్ బాబు , రష్మీక మందన్న హీరో హీరోయిన్లు గా  కలిసి నటిస్తున్న చిత్రం 'సరిలేరూ నీకెవ్వరూ'..   డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకు పోతుంది. 
 

విడుదలైన దగ్గరనుంచి మంచి పాజిటివ్ టాక్ తో సినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా తో ముగ్గురు నటులు రీ ఎంట్రీ ఇచ్చారు వారిలో విజయశాంతి 13ఏళ్ల తర్వాత సినిమాలో కనిపిస్తుంటే. మరో నటి సంగీత కూడా చాలా కాలం తర్వత తెలుగులో నటించారు. ఇక కమెడియన్ కామ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కూడా ఈ సినిమా తో రీఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ అంతగా నవ్వించలేక పోయిన ఓకే అనిపించుకుంది. 

 

అయితే ట్రైన్ సీన్ లో బ్లడ్ల గణేష్ ఉన్నది కొంచం సేపే అయినా ఆ సీన్ అనుకున్నంతగా పండలేదు. నవ్వు కాదు కదా నీరసం వచ్చింది. దాంతో ఆ సీన్ ను తొలగించాలని చిత్ర యూనిట్ బావిస్తున్నారంట.  దీంతో చిత్ర యూనిట్ కొంత భాగాన్ని ట్రీమ్‌ చేసే ఆలోచనలో ఉన్నారన్న టాక్‌ వినిపిస్తోంది. ముఖ్యంగా బండ్ల గణేష్‌ సన్నివేశాల వరకు తొలగించాలని భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.. ప్రస్తుతం మహేష్ వంశీ పైడి పల్లి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించను న్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: