ఏ ముహూర్తాన స్వీటి అనుష్క అరుంధతి సినిమా చేశారో గాని అప్పటి నుంచే టాలీవుడ్ లో ఆమే క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటి నుంచే ఏ దర్శక, రచయితలైనా ప్రత్యేకంగా అనుష్క కోసం లేడీ ఓరియెంటెడ్ కథలనే సిద్దం చేసి అప్రోచ్ అవుతున్నారు. అలా వచ్చిన సినిమాలన్ని దాదాపు హిట్ అయ్యాయి. ఇక కంప్లీట్ గా దర్శకుల హీరోయిన్ అయిన అనుష్క కథకు తగ్గట్టు తనని తాను మార్చుకోవడానికి ఎంతగానో కష్టపడుతుంది. అందుకు ఉదాహరణ సైజ్ జీరో అని ఖచ్చితంగా చెప్పాలి. అయితే ఆ సినిమా తర్వాత బాగా లావు కావడంతో అనుష్కకి కాస్త మైనస్ గా కూడా అయింది. అయినా కూడా ఏమాత్రం బాధపడుకుండా మళ్ళీ మొదటి లుక్ లోకి వచ్చే విధంగా ప్రయత్నిస్తోంది. 

 

ఇక ఈనెల 31న విడుదల కావాల్సిన అనుష్క నిశ్శబ్ధం సినిమా డిలే అవుతుందని తాజాగా వార్తలు వస్తున్నాయి. కోన వెంకట్ తో కలిసి పీపుల్స్ మీడియా చేసిన జాయింట్ ప్రాజెక్ట్ అన్న విషయం తెలిసిందే. మాధవన్  ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా లోని ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.  ఇక ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన న్యూస్ ఏమిటంటే ఈ సినిమా విడుదల వాయిదా పడుతోందని. అనుకున్నప్రకారం 31 న రావడం లేదని అంటున్నారు. అయితే ప్రత్యేకించి టెక్నికల్ రీజన్స్ అయితే ఏమీ లేవని తెలుస్తోంది.  సినిమా వర్క్ అంతా కంప్లీటయిందట. ఇక రిలీజ్ చేయడమే ఆలస్యం. అంతేకాదు ఈ సినిమా దర్శకుడు కూడా తన తరువాత సినిమా ప్రయత్నాలు కూడా మొదలు పెట్టుకున్నాడట.

 

మరి ఇలాంటి నేపథ్యంలో సినిమా వాయిదా అంటే, బహుశా సీజన్ కోసమో లేదా పోటీగా వస్తున్న సినిమాల ను తట్టుకోలేకనో అన్న టాక్ నడుస్తోంది. వాస్తవంగా అదే రోజు మరో రెండు మీడియం సినిమాలు విడుదలవుతున్నాయి. ఆ ముందువారం డిస్కోరాజా రిలీజవుతోంది. మరి ఇవన్ని ఆలోచించి మేకర్స్ నిశ్శబ్ధం సినిమాని పోస్ట్ పోన్ చేశారా అన్న అనుమానాలు వస్తున్నాయి. మరి ఎందుకు సినిమాని అనుకున్న సమయానికి రిలీజ్ చేయడం లేదో కోన టీం క్లారిటి ఇస్తే బావుంటుంది. అలాగే మళ్ళీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తే స్వీటి ఫ్యాన్స్ కి క్లారిటి వస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: