టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నడూ లేనంత ఆనందంగా ఉన్నానని మొన్న జరిగిన ఆయన నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ చెప్పారు. ఇప్పటికే భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టిన మహేష్ బాబు, సరిలేరు తో కూడా మరొక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. వాస్తవానికి సరిలేరు సినిమాలో సూపర్ హిట్ మూవీకి ఉండవలసినంత స్టఫ్ అయితే లేదనే చెప్పాలి. దాదాపుగా సినిమాని బాగానే తీసిన దర్శకుడు అనిల్, సెకండ్ హాఫ్ ని మాత్రం ప్రేక్షకులని ఆకట్టుకునే రేంజ్ లో తెరకెక్కించలేదని కొందరు ప్రేక్షకులు సినిమాపై విమర్శలు చేసారు. కాగా ప్రస్తుతం సంక్రాంతి సీజన్ కావడంతో పాటు, 

 

మంచి ఎంటర్టైన్మెంట్ తో కూడిన క్యారెక్టర్ లో మహేష్ బాబు చాలా రోజుల తరువాత నటించడంతో ఈ సినిమాను చూసేందుకు ఆయన ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం క్యూలు కట్టారు. ఇప్పటికే దాదాపుగా రూ.112 కోట్ల పైచిలుకు కలెక్షన్ ని కొల్లగొట్టిన ఈ సినిమా, ఇంకా దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. అలానే సినిమా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ ని అందుకోవడంతో మెజారిటీ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరొక రెండు, మూడు రోజుల్లో లాభాల్లోకి ప్రవేశించనున్న ఈ సినిమాకు సంబంధించి ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన టాలీవుడ్ బడా నిర్మాత గారు మొదట్లో లాభాల్లో వాటా అవసరం లేదని అన్నారట. 

 

అయితే సూపర్ స్టార్ మహేష్ స్టామినాతో సినిమా ఊహించని రేంజ్ లో లాభాల బాట పట్టనుండడంతో మైండ్ బ్లాక్ అయిన సదరు నిర్మాత, ప్రస్తుతం లాభాల్లో వాటా ఆడుగుతున్నాడని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆ నిర్మాత ఎవరు అనే విషయం అటుంచితే, సడన్ గా సదరు నిర్మాత గారు లాభాల్లో వట అడిగేసరికి సినిమా నిర్మాణంలో కొంత పెట్టుబడి పెట్టిన హీరో మహేష్ బాబు కొంత ఆశ్చర్యపోయారని అంటున్నారు. అయితే ప్రస్తుతం తాను వెకేషన్ కు వెళ్తున్నానని, రెండు నెలల తరువాత తిరిగి వచ్చాక లాభాల విషయం మాట్లాడుదాం అని చెప్పి మహేష్ విదేశాలకు వెళ్లిపోయినట్లు చెప్తున్నారు. మరి దీనిలో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియదుగాని, ఈ వార్త మాత్రం ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: