ఎంతో కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా కొనసాగుతూ ఎన్నో విజయవంతమైన సినిమాలో నటించిన హీరో రాజశేఖర్. ఇప్పటికీ రాజశేఖర్ స్టైల్ కి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అయితే హీరో రాజశేఖర్ నట వారసురాలిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ శివాత్మిక. జీవిత రాజశేఖర్ గారాలపట్టి అయిన శివాత్మిక దొరసాని సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా  పరిచయమైంది. అయితే మొదటి సినిమాతోనే ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వైవిధ్యమైన కథను ఎంచుకుని నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించింది శివాత్మిక. దొరసాని సినిమా లో నటించిన శివాత్మిక సినిమాలో  టైటిల్ పాత్రలో నటించింది. ఇక మొదటి సినిమాతోనే తన నటనకి  ఎన్నో ప్రశంసలు అందుకుంది ఈ అమ్మడు . 

 

 

 మొదటి సినిమాతోనే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న నటిగా  అద్భుత నటనతో అదరగొట్టేసింది. అయితే శివాత్మిక తో పాటు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా మొదటి సినిమాగా టాలీవుడ్ హీరోగా దొరసాని సినిమాతో పరిచయం అయ్యాడు. పరువు హత్య నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. పరువు హత్యలు కళ్ళకు కట్టినట్లు దొరసాని సినిమాలో చూపించారు దర్శకుడు. దొరసాని పాత్రలో నిజమైన దొరసాని ల నటించింది జీవిత రాజశేఖర్ గారాలపట్టి శివాత్మిక. అయితే సినిమా కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది ఈ అమ్మడు. 

 

 

 ప్రస్తుతం తన రెండో సినిమా కోసం రెడీ అవుతుంది శివాత్మిక. శివాత్మక నటిస్తున్న రెండవ చిత్రాన్ని దుర్గా నరేష్ గుట్ట దర్శకత్వంలో తెరకెక్కుతోంది. మొదటి సినిమాలో  దొరసాని గా కనిపించిన శివాత్మిక... రెండవ సినిమాలో మాత్రం మోడ్రన్ గర్ల్ గా... నటించనుంది. ఈ సినిమాలో  యంగ్ హీరో అరుణ్  అదిత్ తో రొమాన్స్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఎస్కేఎస్  క్రియేషన్స్ బ్యానర్పై శివ,  దినేష్,  రాహుల్, అయ్యర్ నకరకంటి  నిర్మించనున్నారు. ఇక నిన్నటి తరం హీరోయిన్ అయినా ఇంద్రజ  శివాత్మిక రెండవ సినిమాలో ఓ ప్రముఖ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. కాగా కాగా ఈ సినిమా జనవరి 20న పూజా కార్యక్రమాలు జరుపుకుంటుంది. సినిమాలు విలక్షణ నటుడు పోసాని కృష్ణమురళి తో పాటు పలువురు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: