అమ్మ బొమ్మాళి.. నీకు పెళ్లా అనే ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే.. అయితే సినిమాలు ఎంత హిట్ టాక్ ను అందుకుంటే సినిమాలోని వాళ్ళు అంతా ఫేమస్ అవుతారు... ఇకపోతే సినిమా హిట్ అయితే ఇప్పుడు అదే సినిమా రీమేక్ కు కూడా ఆనవాయితీగా వస్తున్నాయి.. ఈ సినిమా ద్వారా అనుష్క చాలా పాపులర్ అయింది..

 

అరుంధతి సినిమాతర్వాత అనుష్క కెరియర్ మొత్తం మారిపోయింది. ఎక్కడ చుసిన అనుష్క పేరేవినిపించింది . ఆ తరువాత వచ్చిన బాహుబలి సినిమా అనుష్క రేంజును ఎక్కడికో తీసుకెళ్లింది. దాంతో అనుష్క సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటారు. 

 


తాజాగా అనుష్కా నటిస్తున్న సినిమా నిశబ్దం ఈ సినిమా లో అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్స్‌పై టీజీ విశ్వప్రసాద్‌, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఏక కాలంలో రూపొందుతోంది ఈ సినిమా . ఇటీవలే షూటింగ్ ఫినిష్ కావడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తున్నారు మేకర్స్. 


ఇప్పటి వరకు ఈ సినిమా నుండి వచ్చిన అన్నీ సినిమా కు భారీ హైప్ ను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.. ఈ కార్యక్రమాలు పూర్తిచేసి జనవరి 31న 'నిశ్శబ్దం' సినిమా విడుదల
చేయాలనుకున్నారు .అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమవుతోందట. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా అనుష్క కు ఈ మాత్రం హిట్ నీ అందిస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: