టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు ప్రస్తుతం మంచి టాక్ తో, అలానే కలెక్షన్ తో దూసుకెళ్తున్న విషయం తెల్సిందే. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించగా దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని, రత్నవేలు ఫొటోగ్రఫీని అందించడం జరిగింది. ఇక ఇటీవల భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో వరుస విజయాలు అందుకున్న సూపర్ స్టార్, ప్రస్తుతం సరిలేరు సక్సెస్ తో వరుసగా హ్యాట్రిక్ విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు. ఇక తన సినిమాల్లో అప్పుడప్పుడు మాత్రమే హీరోయిన్స్ ని రిపీట్ చేసే మహేష్ బాబు, ఇప్పటివరకు సమంతను మూడు సినిమాల్లో రిపీట్ చేయగా, త్రిష ను రెండు సార్లు, కాజల్ ని రెండు సార్లు రిపీట్ చేయడం జరిగింది. 

 

ఇక నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, రెండేళ్ల క్రితం కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమాలో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన కియారా అద్వానీతో మరొక్కసారి జోడి కట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సరిలేరు సక్సెస్ తో మంచి జోరుమీదున్న సూపర్ స్టార్, తదుపరి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. గతంలో మహేష్, వంశీ కాంబినేషన్లో వచ్చిన మహర్షి సినిమాకు పూర్తి భిన్నంగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో పూర్తి మాస్

 

కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు మంచి స్కోప్ ఉందని, అయితే అటువంటి పాత్రకు కియారా అయితే న్యాయం చేయగలదని భావించిన వంశీ, ఆమెను తీసుకునేందుకు సిద్ధం అయినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లిన మహేష్ తిరిగి రాగానే కియారా విషయమై చర్చించి, ఫైనల్ గా కథను ఆమెకు వినిపిస్తారని అంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు గాని, ఒకవేళ నిజమే అయితే మాత్రం కియారాకు మరొక్కసారి సూపర్ స్టార్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ లభించినట్లే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: