కొన్నేళ్ల నుండి ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న క్రేజీ షో జబర్దస్త్ గురించి మన తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దాదాపుగా ఏడేళ్లకు పైగా మంచి రేటింగ్స్, తో పాటు విశేషమైన ప్రేక్షక అభిమానంతో కొనసాగుతున్న ఈ షో ప్రారంభం అయిన తరువాత నుండి ఈటివి యొక్క ప్రాభవం, రేటింగ్స్ మరింతగా పెరిగాయని చెప్పాలి. అయితే అదే షోలో కొన్నేళ్ల నుండి ఇద్దరు జడ్జీల్లో ఒకరిగా వ్యవహరిస్తున్న మెగాబ్రదర్ నాగబాబు, ఇటీవల హఠాత్తుగా షో మేనేజ్మెంట్ బృందంలోని కొందరి ప్రవర్తన తనకు నచ్చకపోవడం వలన బయటకు రావడం జరిగిందని ఆయన వెల్లడించిన విషయం తెలిసిందే. 

 

అయితే నాగబాబు తో పాటు కిరాక్ ఆర్పీ, చమ్మక్ చంద్ర కూడా షో నుండి బయటకు రావడం, అనంతరం వారందరూ కూడా జీ తెలుగులో ప్రసారం అవుతున్న అదిరింది షోలో పాల్గొనడం జరిగింది. ఇక ఆ షోకు కూడా జడ్జిగానే వ్యవహరిస్తున్న నాగబాబు, దానిని జబర్దస్త్ రేంజ్ లో సక్సెస్ చేసేందకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి మొదట్లో షోకు పెద్దగా రేటింగ్స్ రాలేదని, అయితే ఇటీవల రెండు వారాలుగా గతంతో పోలిస్తే షోపై ప్రేక్షకుల ఆదరణ పెరుగుతోందని సమాచారం. ఇకపోతే షో పై మరింతగా క్రేజ్ పెరిగేందుకు నాగబాబు సహా, అదిరింది నిర్వాహక బృదం కూడా ఎప్పటికప్పడు సరికొత్త ఆలోచనలు చేస్తోందట. అయితే ఎంత అదిరింది షో సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతున్నప్పటికీ కూడా , 

 

ఆ షోను చూస్తుంటే ముమ్మూర్తులా జబర్దస్త్ గుర్తుకు వస్తోందని, అది మాత్రమే కాక జబర్దస్త్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ సౌండింగ్ ని యధాతధంగా అదిరింది షోకు వినియోగించడం వలన, షో పై కాపీ అనే ముద్ర పడడంతో పాటు ప్రేక్షకుల్లో కూడా పెద్దగా ఆసక్తి కలగడం లేదని అంటున్నారు. కావున వీలైనంత త్వరగా అదిరింది షో నిర్వాహకులు, ఆ షోను జబర్దస్త్ కు కాపీ అనే విధంగా అనిపించే ప్రతి ఒక్క విషయమై మరింత  శ్రద్ధ తీసుకుని వాటిలో మార్పులు చేస్తే, రాబోయే రోజుల్లో అదిరింది షో కూడా మంచి సక్సెస్ సాధించే అవకాశం ఉంటుందని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై అదిరింది నిర్వాహక బృందం ఎంతమేర జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: