అల్లరి నరేష్ .. అల్లరి సినిమాతో హీరోగా పరిచయం అయిన హీరో. ఆ సినిమా సక్సెస్ తో దాన్నే తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు నరేష్. ప్రముఖ దర్శకుడు ఈ వివి సత్యనారాయణ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన నరేష్ ఆ తరువాత హీరోగా తనదైన మార్కు సంపాదించుకుని హీరోగా నిలదొక్కుకున్నాడు. ఓ దశలో రాజేంద్ర ప్రసాద్ కు ఫొటోగా కూడా మారాడు. వరుస సినిమాలు, సక్సెస్ లతో బిజీగా ఉండే నరేష్ సుడిగాడు సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు. ఆ సినిమా తరువాత అయన సక్సెస్ కు బ్రేక్ పడింది. ఆ తరువాత ఎన్ని సినిమాలు చేసిన పెద్దగా లాభం లేకపోయింది. వరుస పరాజయాలతో అటు ఛాన్సులు కూడా పోయాయి.

దాంతో కాస్త బ్రేక్ తీసుకుని లేటెస్ట్ గా మహేష్ బాబు సినిమాలో సపోర్టింగ్ రోల్ లో నటించాడు. దాంతో పాటు సునీల్ తో కలిసి సిల్లీ ఫెలోస్ అనే సినిమాలో నటించిన నరేష్ ప్రస్తుతం బంగారు బుల్లోడు అనే సినిమాలో నటిస్తున్నాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే యాభై సినిమాలు పూర్తీ చేసాడు నరేష్. తాజాగా అయన మరో సినిమా ప్రారంభం కానుంది. దర్శకుడు వేగేశ్న సతీష్ నిర్మాతగా విజయ్ కనకమేడల అనే కొత్త దర్శకుడు తెరకెక్కించే సినిమా ఈ నెల 20 న మొదలు కానుంది. తాజాగా ఈ సినిమా పోస్టర్ ఒకటి విడుదల చేసారు. అందులో నరేష్ తన కామెడీ మార్కు కు బిన్నంగా కనిపిస్తుండడం విశేషం. ఈ పోస్టర్ చూస్తుంటే ఇదేదో .. థ్రిల్లర్ జోనర్ అన్నది అర్థం అవుతుంది. నరేష్ 57వ సినిమా ఇది. ఇందులో తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీ రోల్ పోషిస్తుందట. మరి ఈ సినిమాతో అయినా అల్లరోడి కెరీర్ కొనసాగుతుందేమో చూద్దాం. మంచి హిట్లు కొడుతున్న స‌మయంలో అల్ల‌రిన‌రేష్ స‌డెన్‌గా ఎందుకో డ‌ల్ల‌య్యార‌నే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: