టైటిల్ చూడగానే కోపం వచ్చేసుంటుంది.. ఫ్యాన్స్ కు.. మళ్ళి ఎం.. చేస్తాం మీ హీరోలు టాలీవుడ్ పరువు గంగలో కలిపితిరి.. మీరు ఆ పరువును ఇంకాస్త లోతుకు తొక్కేశారు అని ఫైర్ అవుతున్నారు టాలీవుడ్ అభిమానులు.. ఎందుకయ్యా.. ఇలా ? కలెక్షన్లు తక్కువ అని చెప్పుకుంటే మీ పరువు ఏమైనా పోతుందా? పోదు కదా!

 

ఒకరి కల్లెక్షన్లపై మరొకరు.. అన్ని తప్పు కలెక్షన్ల గురించి చెప్పుకుంటున్నారు! ఆలా చెప్పుకోకూడదు కదా! నాన్ బాహుబలి రికార్డ్స్ బద్ధులు కొట్టం అని ఒకరు చెప్తారు.. మారొకరు మరి కొన్ని రికార్డులు బద్దలు కొట్టం అంటారు! అసలు ఎవరు ఏ రికార్డు బద్దలు కొట్టకనే కొట్టేశాం అని చెప్పారు.. ఇద్దరు అలానే చేశారు. 

 

హీరో పరువు ఆ హీరో అభిమానులు తీస్తే.. ఆ హీరో పరువు ఈ హీరో అభిమానులు తీశారు.. ఇద్దరి అభిమానులు కలిసి టాలీవుడ్ పరువు ట్విట్టర్ వేధికగా తీసేశారు అని అంటున్నారు టాలీవుడ్ అభిమానులు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మొన్న సంక్రాంతి పండుగ సంధర్భంగా ఒకరోజు అటు ఇటు స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 

 

సినిమాలు రెండు అద్భుతంగా ఉన్నాయి. అంటే.. సరిలేరు నీకెవ్వరూ సినిమా కాస్త అటు ఇటు ఉన్న కూడా అల వైకుంఠపురములో సినిమా అద్భుతంగా ఉంది. దీంతో ఒక రోజు ముందు వచ్చిన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా కాస్త కలెక్షన్లు తగ్గిన అల్లు అర్జున్ అల వైకుంఠపురములో కి ఏ మాత్రం తగ్గకుండా అభిమానులు సినిమా కలెక్షన్స్ ను అదరగొట్టేశారు. 

 

అయితే.. సోషల్ మీడియాలో 'సరిలేరు నేకెవ్వరూ, అల వైకుంఠపురములో పోస్టర్ల వార్ భారీగా నడిచింది. యూనిట్ కలెక్షన్ల పోస్టర్లు విడుదల చేయడంతో.. హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు జరిగాయి. దీంతో చరణ్ ను చూసి మహేష్, బన్నీలు నేర్చుకోవాలని నెటిజన్లు మండిపడ్డారు. నాన్ బాహుబలి రెకార్డులన్నింటినీ రంగస్థలం సినిమా బద్దలు కొట్టినా, కలెక్షన్ల ప్రస్తావన అసలు ఏ మాత్రం తీసుకురాలేదు.. చరణ్ లాగా హుందాగా ఉండండి.. సిగ్గులేకుండా అలా ఫేక్ కలెక్షన్లు ప్రజలకు చూపించి అభిమానుల మధ్య గొడవలు తియ్యకండి అని నెటిజన్లు నాలుగు రోజుల నుండి మండిపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: