బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె ఈ మధ్య కాలంలో ఏ చిన్న పని చేసిన తనే సెంటర్ పాయింట్ అవుతూ వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకూ జేఎన్‌యూ సందర్శనపై రాజకీయ నాయకుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న దీపికకు తాజాగా బాలీవుడ్ సినీ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ బాలీవుడ్‌ హీరోయిన్ యాసిడ్‌ బాధితురాలి పాత్రలో నటించిన ‘ఛపాక్‌’ ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. దీపిక ఎంతో అద్భుతంగా నటించిందని విమర్శకులు కూడా దీపికను బాగా మెచ్చుకున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. సినిమా ప్రమోషన్‌ కోసం తాజాగా తను చేసిన ఓ పని తనకే కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది.

 

దీపిక తాను నటించిన సినిమా పాత్రలను టిక్‌టాక్‌లో చేయాలని టిక్‌టాక్‌ నటులకు ఛాలెంజ్‌ విసిరింది.అందులో ఛపాక్‌ సినిమాలోని యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ పాత్ర కూడా ఉంది. దీపిక విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన ఓ మేకప్‌ ఆర్టిస్ట్‌.. యాసిడ్‌ బాధితురాలిగా మేకప్‌ వేసుకొని దీపికతో కలిసి ఓ వీడియో చేసింది. అయితే, 39 సెకన్ల నిడివి గల ఆ టిక్‌టాక్‌ వీడియో దీపికపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. సినిమా ప్రమోషన్‌ కోసం దీపిక మరీ దిగజారి ప్రవర్తిస్తోందని దీపిక అభిమానులు మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కూడా మండిపడుతున్నారు. ఆమె యాసిడ్‌ బాధితులను కించపరుస్తోందని మండిపడ్డారు. జేఎన్‌యూ సందర్శన కూడా సినిమా ప్రమోషన్‌ కోసమే చేశావని అనుమానం వస్తోందని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. 

 

యాసిడ్‌ బాధితుల జీవితాలను తన సినిమాలకు వాడుకోవడం ఎంత వరకు సరైందని దీపికను సూటిగా ప్రశ్నిస్తున్నారు. సినిమా వాళ్లు ఏం చేసినా డబ్బు సంపాదించేందుకే చేస్తారు అని మరికొందరు తీవ్రస్థాయిలో దీపికను సెంటర్ చేసి మాట్లాడుతున్నారు. దీపిక చేసిన ఈ పిచ్చి వల్ల మిగతా సినిమా వాళ్ళందరి పరువు పోతోంది. అంతేకాదు ఒకరు చేసిన పని వల్ల ఇండస్ట్రీ వాల్లందరిని ఇదంతా బిజినెస్ ట్రిక్ అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. మరి దీపిక ఎందుకిలా చేస్తుందో తనకే అర్థమవ్వాలి. ఇప్పటి నుంచైనా ఇలాంటి పనులు మానుకుంటే బావుంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: