మంచు విష్ణు వరుస అపజయాలతో గతకొంత కాలంగా సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఇక కలెక్షన్ కింగ్ వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన మంచు విష్ణు ఆ స్టార్‌ ఇమేజ్‌ అందుకోలేకపోయాడు. కామెడీ సినిమాలతో ఒకటి రెండు హిట్‌లు సాధించిన కెరీర్‌ను టర్న్‌ చేసే స్థాయి సూపర్‌ హిట్ మాత్రం ఒక్కటి కూడా రాలేదు. దీంతో సినిమాల నుంచి లాంగ్‌ గ్యాప్ తీసుకుని, కొంత కాలంగా బిజినెస్‌ మీదే దృష్టి పెట్టాడు.

 

 

ఇకపోతే ఇప్పుడు హాలీవుడ్‌ తరహాలో ఓ సినిమా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో విష్ణు హీరోగా, హాలీవుడ్ ద‌ర్శ‌కుడు జెఫ్రీ గీ చిన్ ద‌ర్శక‌త్వంలో, తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో ఒకే సారి తెరకెక్కుతున్న ఈ సైన్స్‌ ఫిక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ప్రపంచలోనే బిగ్గెస్ట్ ఐటీ స్కామ్‌ నేపథ్యంలో యాదార్థ సంఘటనల ఆధారంగా.  24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై తెర‌కెక్కిస్తుండగా దీనికి మోస‌గాళ్ళు అని టైటిల్ ఖ‌రారు చేసారు.

 

 

ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి ఓ కీల‌క భూమిక పోషిస్తుండగా, ప్ర‌స్తుతం విష్ణు మంచు, సునీల్ శెట్టి మ‌ధ్య భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌ని హాలీవుడ్ యాక్ష‌న్ నిపుణుల ఆధ్వ‌ర్యంలో.. హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్‌లో తెర‌కెక్కిస్తున్నారు. ఈ స‌న్నివేశం కోసం ఇద్ద‌రు స్టార్స్ ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ‌ను కూడా తీసుకోవ‌టం విశేషం..

 

 

ఈ సినిమాలో మంచు విష్ణు, సరసన కాజల్‌,హీరోయిన్ గా నటిస్తుండగా, సునీల్‌ శెట్టి, నవదీప్‌, నవీన్‌ చంద్ర, రూహి సింగ్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే ఇప్ప‌టివ‌ర‌కు తెలుగు తెర‌పై రాన‌టువంటి క‌థాంశాన్ని మోస‌గాళ్ళు లో ఉంటుంద‌ని, చిత్రంలో యాక్ష‌న్ సీన్ల‌న్నీ ప్రేక్ష‌కుల‌న ఆక‌ట్టుకునేలా ఉంటాయ‌ని, శ‌ర‌వేగంతో సినిమాని పూర్తి చేసి వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని మంచు విష్ణు మీడియాకు తెలిపారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: