ప్రిన్స్ మహేష్ బాబుకు అతడి పిల్లలు సితార గౌతమ్ అంటే విపరీతమైన ఇష్టం. దీనితో తన షూటింగ్ సమయంలో బ్రేక్ వస్తే చాలు ఎదో ఒక దేశానికి తన భార్య పిల్లలతో విదేశాలకు హాలిడే ట్రిప్ నిమిత్తం వెళ్లిపోతు ఉంటాడు. ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ ఫలితం తేలిపోవడంతో ఇక తన పనిలేదు అని భావించి మహేష్ తన పిల్లలతో కలిసి అమెరికాకు హాలిడే ట్రిప్ కు వెళ్ళిపోయాడు. 

‘సరిలేరు నీకెవ్వరు’ కు సంబంధించి తన చివరి ఇంటర్వ్యూగా ఒక ప్రముఖ దిన పత్రికకు నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పిల్లల ఫై ఆశ్చర్యకర కామెంట్స్ చేసాడు. ప్రస్తుత జనరేషన్ లోని పిల్లలను కంట్రోల్ చేయలేమనీ వారికి ఉన్న తెలివి తేటలు ఇంత వయసు వచ్చినా తనకు కూడ లేవు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. 

గతంలో తన చిన్నతనంలో తన తండ్రి కృష్ణ అంటే భయంతో పాటు పితృస్వామ్య భావజాలం ఉండేదనీ అయితే ఇప్పటి పిల్లలు తమ తండ్రి కంటే తల్లితోనే క్లోజ్ గా ఉంటునారని కామెంట్ చేసాడు. ప్రస్తుతానికి సితార కు సినిమా ల్పి అభిరుచి ఉన్నా భవిష్యత్ లో నటిగా మారుతుంది అన్న అభిప్రాయం తనకు లేదనీ ఇప్పటి జనరేషన్ పిల్లలు తమ తల్లి తండ్రులు కోరుకున్నట్లుగా తమకు ఎలా ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనలను బట్టి ఉంటున్నారు అంటూ నేటి తరం పిల్లల పై కామెంట్స్ చేసాడు. 

గతంలో తన అక్క మంజులకు హీరోయిన్ గా అవకాశం వస్తే తన తండ్రి వద్దు అన్నాడని చెప్పి తన కెరియర్ ను త్యాగం చేసిన విషయాలను వివరిస్తూ అలాంటి త్యాగాలు నేటితరం పిల్లలు చేస్తారు అన్న అభిప్రాయం తనకు లేదు అంటూ కామెంట్స్ చేసాడు. ఈనాటితరం పిల్లలు సరైన మార్గంలో వెళుతున్నారా లేదా అన్న విషయం చూడగలం తప్ప వారి చదువులు వారి ఇష్టాల పై తల్లి తండ్రుల అభిప్రాయాలు ప్రభావితం చేయవు అంటూ మహేష్ నేటితరం పిల్లలలో వస్తున్న మార్పుల గురించి కామెంట్స్ చేసాడు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: