సినిమాల్లో టాప్ హీరోగా  కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్బై చెప్పేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు తప్ప మరో సారి సినిమాల వైపు మాత్రం తొంగి చూడలేదు. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్  మళ్ళీ సినిమాల్లోకి వస్తారని అందరూ అనుకున్నారు. కానీ పలుమార్లు స్పందించిన పవన్ కళ్యాణ్ తాను సినిమాల్లోకి రాను అంటూ తేల్చి చెప్పారు. అయినప్పటికీ దర్శక నిర్మాతలు మాత్రం పట్టువిడవకుండా పవన్ కళ్యాణ్ ని సినిమాలో నటింపజేసేందుకు ఒప్పించారు. ఈ క్రమంలోనే హిందీ లో మంచి విజయం సాధించిన పింక్ మూవీ తెలుగులో రీమేక్ చేస్తారని... అమితాబచ్చన్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తారు అంటూ వార్తలు కూడా వచ్చాయి. 

 

 

ఈ వార్తలపై వాళ్ళు వీళ్ళు క్లారిటీ ఇవ్వడమే తప్ప పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడూ క్లారిటీ ఇచ్చింది లేదు. ఇకపోతే పవన్ అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ ఎప్పుదెప్పుడు  సినిమాల్లో నటిస్తారా అని నిరీక్షణ గా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిరీక్షణ ఫలించింది. పవన్ కళ్యాణ్ నటించబోతున్న పింక్ మూవీ రీమేక్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాలో నివేద థామస్అంజలి, అనన్య  కీలక పాత్రలు  పోషిస్తుండగా వేణు శ్రీరామ్ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. కాగా  ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ లు  సంయుక్తంగా నిర్మించనున్నారు. కాగా పిక్ సినిమాలో పవన్ ఇమేజ్కు తగ్గట్టుగానే కొన్ని మార్పులు చేసినట్లు సమాచారం. 

 

 

 అయితే పింక్ సినిమాలో పవన్ సరసన నటించే హీరోయిన్ ఎవరు అన్న దానిపై క్లారిటీ వచ్చిందని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నారు. పింక్ సినిమాలు పవన్ కళ్యాణ్ సరసన నటించేందుకు.... ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసి వరుస విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న పూజా హెగ్డే పేరు దాదాపు ఖరారైపోయింది అని ప్రచారం జరుగుతుంది. అయితే మరో వారంలో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సమ్మర్ లో మే 23న ఈ మూవీ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట చిత్ర బృందం. అంతేకాకుండా పింక్ సినిమాకు గాను పవన్ కళ్యాణ్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అన్న వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: