స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్వకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుం టోన్న విషయం అంద‌రికీ తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఈచిత్రానికి సంబంధించిన‌ ఒక టైటిల్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ చిత్ర యూనిట్ ఈ మూవీకి ఎటువంటి టైటిల్ ను ఖరారు చెయ్యలేదు. కొన్ని వెబ్ సైట్స్ లో ఈ మూవీకి టైటిల్ పై వస్తున్న వార్తల్లో నిజం లేద‌ని చిత్ర యూనిట్ తెలిపింది. 

 

టైటిల్ ఖరారు అవ్వగానే చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారు. అల్లు అర్జున్ కి ఇది 20వ సినిమా అవ్వడం విశేషం. సుకుమార్ తో బన్నీ చేస్తున్న మూడో సినిమా ఇది. ప్ర‌స్తుతం అల్లుఅర్జున్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `అల‌వైకుంఠ‌పురంలో` విడుద‌లై మంచి హిట్ కొట్టిన విష‌యం తెలిసిందే. 

 

ఇక అల్లుఅర్జున్‌, సుకుమార్ క‌లిసి చేయ‌బోయే చిత్రంలో సుకుమార్ బ‌న్నీని చాలా స్టైలిష్‌గా పాష్‌గా చూపించ‌బోతున్నార‌ని స‌మాచారం. గ‌తంలో బ‌న్నీ కాస్త మాస్ లుక్‌లో చేసిన సినిమాలు ఏమీ పెద్ద‌గా ఆడ‌లేదు. నా పేరు సూర్య‌, ఇంకా ఇలా కాస్త మాస్‌గా ఉన్న చిత్రాలు బ‌న్నీ పెద్దగా హిట్ కాలేదు. మ‌రి సుకుమార్ బ‌న్నీని ఎలా చూపించ‌బోతున్నారో తెర‌మీదే చూడాలి. ఇక ఈ చిత్రంలో కాస్ట్ అండ్ క్రూ గురించి కూడా స‌మాచారం తెలియాల్సి ఉంది. బన్నీతో చేయబోయే తన తర్వాతి సినిమా విషయంలో ‘రంగస్థలం’ను ఆయన చాలా రకాలుగా ఫాలో అవుతున్నట్లుంది. దాని మాదిరే ఇదీ పీరియడ్ ఫిలిం. గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. ఇందులోనూ థ్రిల్లర్ లక్షణాలున్నాయట. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరిగే కథ ఇది. అందుకే  టైటిల్ ఇంకా ఖ‌రారు చేయ‌లేదు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రం దసరా కానుకగా రిలీజయ్యే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: