టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లో సినిమాలు వస్తే భారీ అంచనాలు నెలకొంటాయి.  ముఖ్యంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఏ హీరోతో సినిమా తీసినా ఆ సినిమాపై మొదటి నుంచి ఎన్నో అంచనాలు ఏర్పడుతాయి.  కామెడీ, ఎమెషన్స్ మిలితం చేస్తూ మంచి మెసేజ్ ఇస్తుంటారు.  త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు నటించారు.  ఆ మద్య ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’ లాంటి బ్లాక్ బస్టర్ తెరకెక్కించారు.  ఈ సంక్రాంతి కానుకగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా విషయం తెలిసిందే.  ఈ మూవీ మంచి మ్యూజికల్ హిట్ గా సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. 

 

మూవీ బన్నీ కెరీర్ కి కూడా మంచి సక్సెస్ ఇవ్వడంతో అభిమానులు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో రచ్చ చేస్తుంది.  అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత ‘అల వైకుంఠపురములో’ తో భారీ హిట్ అందుకున్న ఆనందంలో మునిగిపోయారు త్రివిక్రమ్ శ్రీనివాస్. అయితే నెక్స్ట్  మాటల మాంత్రికుడు ఎవరితో వర్క్ చేస్తాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  ‘అరవింద సమేత' తరువాత త్రివిక్రమ్ తో మరో సినిమాను చేయడానికి ఎన్టీఆర్ ఆసక్తిని చూపుతున్నాడు. అలాగే ఎన్టీఆర్ తనకి ఇస్తున్న ప్రాముఖ్యతను బట్టి, ఆయనతో సినిమా చేయాలనే ఉద్దేశంతో త్రివిక్రమ్ వున్నాడు.

 

ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్ బిజీలో ఉన్నారు.  ఆ మద్య ఎన్టీఆర్ కి ఒక లైన్ వినిపించడం .. ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని అంటున్నారు. అయితే ఈ సినిమా ఎప్పటి నుంచి సెట్స్ పైకి  వెళ్తుందీ అన్న విషయం ఇంకా అఫిషియల్ గా అనౌన్స్  మెంట్ రావాల్సి ఉంది. అయితే పూర్తి స్క్రిప్ట్ ను ఏప్రిల్ నాటికి సిద్ధం చేసుకుని, సెట్స్ పైకి వెళ్లేలా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఆయన వున్నాడని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: