పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలాకాలం తర్వాత మళ్లీ సినిమాల్లోకి రాబోతున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ ఈ సోమవారం నుంచే షూటింగ్ కు వస్తున్నారని సమాచారం. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల నుంచి షూటింగ్ లో జాయిన్ అవుతారని అనుకున్నారు. కానీ మళ్లీ ఆయనే ఈనెల నుంచే డేట్ లు ఇచ్చారట. సోమవారం ఉదయం పది గంటలకు షూట్ ప్రారంభం అనుకున్నారు. కానీ వున్నట్లుండి ఇప్పుడు ఉదయం ఏడుగంటలకే మార్చారని సమాచారం. విజయవాడలో పార్టీ సమావేశం వుండడంతో, నేను ఒంటి గంట వరకే వుంటానని, అందువల్ల ఉదయం ఏడు గంటలకే షూట్ కు వచ్చేస్తానని పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా నిర్మాత దిల్ రాజుకే చెప్పినట్లు తెలుస్తోంది. ఒంటి వరకు షూటింగ్ చేసి, తరువాత వెళ్లి రాజకీయాలు చూసుకోవాల్సి వుందని వివరించినట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి.

 

ఆ ప్రకారమే అప్పటికప్పుడు నిర్మాత దిల్ రాజు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇక తమిళ సినిమాలో అజిత్ గెడ్డంతోనే నటించారు. అందువల్ల పవన్ కూడా ఈ సినిమాలో గెడ్డంతో చాలా సీన్లలో కనిపిస్తారట. ఆ సీన్లు అన్నీ ముందు తీస్తారని సమాచారం. గెడ్డం తీసేసి చేయాల్సిన సీన్లు, అలాగే డ్యూయట్ లాంటివి ఏవైనా బ్యాలెన్స్ ఉంటే మాత్రం ఆ తరువాత ప్లాన్ చేస్తారని తెలుస్తోంది. అయితే కొంతమంది చేసిన కామెంట్స్ కి పవన్ తిరిగి అవును పొద్దున షూటింగ్ చేస్తా సాయంత్రం మీటింగ్ కొస్తా తప్పేముంది ..అని కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.  

 

వెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించే ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం మాంచి ఫాం లో ఉన్న థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. మే 23న ఈ సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం. ఇక ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే థమన్ మొదటిసారి పవన్ కళ్యాన్ సినిమాకి సంగీతమందిస్తున్నాడు.  ఇక ఈ సినిమా గనక మొదలైతే పవన్ ఎలక్షన్స్ లోకి వెళ్ళకముందు కమిటయిన ప్రాజెక్ట్స్ అన్నీ ఒక్కట్టిగా లైన్ లోకి వస్తాయని అంటున్నారు. వీటిలో త్రివిక్రం సినిమా ఒకటి ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే మైత్రీ మూవి మేకర్స్ తో కూడా ఒక సినిమా ఉందని సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: