వివాదాలకు చాలా దూరం గా ఉంటాడు  థమన్. అయితే నిన్న జరిగిన ‘అల వైకుంఠపురములో’ మూవీ విజయోత్సవ సభలో పొరపాటున ఆవేశంతో థమన్ అన్న మాటలు ఇప్పుడు అతడి మెడకు చుకున్నాయి.  దీనితో థమన్ తనకు సంబంధంలేని అనవసరపు వ్యహారంలో తలదూర్చి మహేష్ అభిమానులకు శత్రువుగా మారాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి.  
 
ప్రస్తుతం ‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాల మధ్య నడుతున్న వార్ మహేష్ బన్నీల ఇగో వార్ గా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమాల  కలెక్షన్ల ఫిగర్ల మీద దుమారం రేగాడమే కాకుండా అల్లు అర్జున్ మహేష్ అభిమానుల మధ్య ఫైట్ నడుస్తోంది. వస్తావానికి ఈ విషయమై మహేష్ అల్లు అర్జున్ లు మౌనంగా ఉన్నా వీరిద్దరి ఫ్యాన్స్ రెచ్చి పోతున్నారు. 

నిన్న జరిగిన ‘అల’ మీట్ లో తమన్ మాట్లాడుతూ 'నిజమైన మాటలే మాట్లాడుకుందాం నిజమైన కలెక్షన్లే చెప్పుకుందాం' అన్న మాటలు థమన్ నోటివెంట వచ్చాయి. అనుకోకుండా థమన్ నోటి వెంట వచ్చిన ఈ మాటలకు అల్లు అరవింద్ త్రివిక్రమ్ బన్నీలు నవ్వడం పై మీడియా కెమెరాల దృష్టి పడింది.

ఇప్పుడు ఈ సంఘటన మహేష్ అభిమానుల వరకు వెళ్ళడంతో తమన్ ను టార్గెట్ చేస్తూ మహేష్ అభిమానులు కామెంట్స్ పెడుతూ షోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. వాస్తవానికి మహేష్ కు కూడ థమన్ మంచి సన్నిహితుడు దీనికితోడు మహేష్ సినిమాలకు కూడ అతడు మంచి పాటలు ఇచ్చాడు. అలాంటి తమన్ ఇప్పుడు ఇలా బన్నీని నమ్ముకుని మహేష్ ను ఎందుకు దూరం చేసుకున్నాడు అంటూ చాలామంది ఆశ్చర్యపడుతున్నారు. అందుకే ఒక మాట మాట్లాడే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించాలి అని అంటారు. అత్యుత్సాహంతో తమన్ అన్న మాటలు ఇప్పుడు కెరియర్ పరంగా మంచి స్పీడ్ లో ఉన్న అతడిని ఒక వర్గం హీరోలకు పరిమితం చేసేలా పరిస్థితులు మారాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: