అజ్ఞాతవాసి  తరువాత  రాజీకీయాల్లో బిజీ అయిపోయి  సినిమాలకు దూరంగా వున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ ద్వారా  మళ్ళీ సినిమాల్లోకి  ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసిందే.  ఈరోజే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాగా  పవన్ కూడా  షూటింగ్ లో  జాయిన్ అయ్యాడు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తరువాత పవన్, సెట్ లో అడుగుపెట్టాడు.  షూటింగ్ లో భాగంగా  తీసిన పవన్  పిక్  లీకై ప్రస్తుతం  సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం పవన్  20రోజులు  డేట్స్ ఇచ్చాడట అంతేకాదు ఈసినిమా చేయడానికి  ఏకంగా  50కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడని సమాచారం. 
 
సాలిడ్ సోషల్ మెసేజ్ తో రానున్న ఈ చిత్రంలో పవన్ లాయర్ గా కనిపించనున్నాడు.  దాంతో ఈసినిమా కు లాయర్ సాబ్ అనే టైటిల్ పెట్టనున్నట్లు సమాచారం.  పవన్ తో పాటు యువ హీరోయిన్లు అంజలి, నివేత థామస్ ముఖ్య పాత్రల్లో కనిపించనుండగా మల్లేశం ఫేమ్ అనన్య అలాగే  యువనటుడు శత్రు  సపోర్టింగ్ రోల్స్ లో నటించనున్నారు. ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ ఈరీమేక్ ను  డైరెక్ట్ చేస్తుండగా  ఎస్ ఎస్ తమన్ సంగీతం  అందిస్తున్నాడు.  బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సమ్మర్ లో ఈచిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. 
 
ఇక  బిగ్ బి అమితాబ్ బచ్చన్ , తాప్సి ప్రధాన పాత్రల్లో నటించిన పింక్  2016లో విడుదలై విమర్శకుల ప్రశంసలు  పొందడమే కాకుండా కమర్షియల్ గా కూడా సక్సెస్ అయ్యింది. ఈచిత్రాన్ని గత ఏడాది కోలీవుడ్ లో అజిత్ తో రీమేక్ చేయగా అక్కడ  కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. మరి తెలుగు లో ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: