'నాపేరు సూర్య...' లాంటి దారుణమైన డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠ‌పుర‌ములో సినిమా చేయడం జరిగింది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటించిన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో తాజాగా ఈ సంక్రాంతి పండుగకు వచ్చిన ‘అల వైకుంఠ‌పుర‌ములో’ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. దీంతో ఇద్దరూ కలసి హ్యాట్రిక్ విజయం సాధించడంతో పాటు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు క్రియేట్ చేసారు. అయితే సినిమాకి మంచి లాభాలు వస్తున్న తరుణంలో సినిమా సక్సెస్ సంబరాలు జరుగుతుండగానే ఈ సినిమాలో కీలక పాత్ర చేసిన సీనియర్ నటుడు మురళీ శర్మ సక్సెస్ మీట్ లో పాల్గొన్న పోవడానికి గల కారణం గురించి ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది.

 

అదేమిటంటే సినిమా నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ కి మురళి శర్మ కి మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు రెమ్యూనరేషన్ విషయంలో అల్లు అరవింద్ పై సీనియర్ యాక్టర్ మురళి శర్మ సీరియస్ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అల వైకుంఠ‌పుర‌ములో సినిమాలు మురళి శర్మ మధ్యతరగతి తండ్రిగా వాల్మీకిగా నటించే అద్భుతంగా సినిమాకి బలమైన క్యారెక్టర్ గా నిలిచాడు. అయితే అల్లు అరవింద్ తో వచ్చిన మనస్పర్ధలు గురించి వస్తున్న వార్తలు చూస్తే సినిమా ఇండస్ట్రీలో ముర‌ళీ శ‌ర్మ‌కి రోజువారీ పారితోషికం తీసుకోవ‌డం అల‌వాటు. కాక‌పోతే.. ఈసినిమా కోసం ఒకేసారి 50 రోజుల కాల్షీట్లు కావ‌ల్సివ‌చ్చింది.

 

50 రోజుల‌కూ ఇంత అని పారితోషికం ఫిక్స‌య్యింది. కాకపోతే ఈ సినిమా కోసం ఆయ‌న 70 రోజులు సెట్‌కి వెళ్లాల్సి వ‌చ్చింద‌ట‌. మిగిలిన 20 రోజుల‌కు గానూ పారితోషికం ఇవ్వ‌మ‌ని ముర‌ళీ శ‌ర్మ డిమాండ్ చేయ‌డం, దాన్ని గీతా ఆర్ట్స్ లైట్ తీసుకోవ‌డం జ‌రిగింద‌ని తెలుస్తోంది.  ఇందువల్లనే సినిమాకి సంబంధించిన 2 సక్సెస్ సమావేశాలలో మురళీశర్మ కనిపించడం లేదన్న టాక్ బలంగా వినబడుతుంది. సినిమా కి కలెక్షన్స్ రికార్డు స్థాయిలో వస్తున్న నేపథ్యంలో మురళి శర్మ తన రెమ్యూనరేషన్ విషయం అల్లు అరవింద్ దృష్టికి తీసుకు వచ్చినట్లు అయితే అల్లు అరవింద్ కొంత దురుసుగా ప్రవర్తించటంతో మురళీశర్మ కూడా సీరియస్ అయినట్లు వార్తలు వినబడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: