పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గడిచిన రెండేళ్ల తరువాత ప్రస్తుతం మళ్ళి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల బాలీవుడ్ లో రిలీజ్ అయిన కోర్ట్ బేస్డ్ డ్రామా మూవీ పింక్ కు రీమేక్ గా తెలుగులో హీరోగా పవన్ నటిస్తున్నారు. అయితే ఇదే సినిమాను కొద్దిరోజుల క్రితం కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తమిళ్ లో నెర్కొండ పార్వై అనే పేరుతో రీమేక్ చేసి మంచి సక్సెస్ ని అందుకున్నారు. ఇక నేడు ఎంతో సింపుల్ గా ఈ సినిమా షూట్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ అగ్ర నిర్మాత బోనీ కపూర్ తో కలిసి, టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. 

 

నిజానికి ఈ సినిమా షూటింగ్ ని పవన్ లేకుండానే కొద్దిరోజుల క్రితమే యూనిట్ ప్రారంభించింది. ఈ సినిమాలోని కీలక పాత్రలో నివేత థామస్, అలానే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మల్లేశం మూవీ ఫేమ్ అనన్య నటిస్తున్నట్లు సమాచారం. అలానే అతి త్వరలో పవన్ కు జోడిగా నటించబోయే హీరోయిన్ ను కూడా ప్రకటించనున్నారు. అయితే నేడు ఈ సినిమా షూటింగ్ కు ఎంట్రీ ఇచ్చిన పవన్ పై కొందరు విమర్శలు చేస్తున్నారు. కొద్దిరోజులుగా ఆంధ్ర రాజధాని అమరావతి విషయమై ఓవైపు రాష్ట్రంలోని రైతులు, ప్రజలు నిరసనలు చేస్తుంటే, రాజ‌ధాని రైతుల‌కు అండగా ఉంటాన‌న్న ప‌వ‌న్‌, స‌రిగ్గా వాళ్ల‌కు అండ‌గా నిల‌బ‌డాల్సిన స‌మ‌యంలో ఈ విధంగా తన సినిమా పనుల్లో ఉండడం ఏమిటని,

 

నిజానికి పవన్ కు ప్రజలపై, రైతులపై సరైన నిబద్దత ఉంటె ఆయన తన సినిమాను ప్రక్కన పెట్టి వారి కోసం పాటు పడేవారు కదా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై పవన్ ఫ్యాన్స్ వాదన మరోలా ఉంది. అదేమిటంటే, పవన్ ఎప్పుడూ రైతుల పక్షపాతి అని, నిన్నటివరకు ఆయన ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడారు, నేటి నుండి ఆయన షూటింగ్ లో ఉన్నప్పటికీ కూడా,  ప్రజల పక్షాన చేసే పోరాటాలకు మాత్రం ఎప్పుడూ ముందు నిలుస్తారని అంటున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: