సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు త‌న 27వ చిత్రం వంశీపైడిప‌ల్లితో చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా త‌మ‌న్‌ను అనుకుంటున్న‌ట్లు స‌మాచారం. నిన్న జ‌రిగిన అల‌వైకుంఠ‌పురంలో స‌క్సెస్ మీట్‌లో త‌మ‌న్ మాట్లాడుతూ... మేము అనుకున్న‌ది ఇచ్చాము, మీరు మాకు స‌క్సెస్‌ని ఇచ్చారు. సినిమా విడుద‌ల‌యింది. మంచి క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. అందుకే యాక్టువ‌ల్ క‌లెక్ష‌న్స్ పోస్ట్ చేశాము అని అన్నాడు. దాని పై మ‌హేష్ ఫ్యాన్స్ మా స‌రిలేరు నీకెవ్వ‌రు ఫేకా అంటూ త‌మ‌న్ పై ర‌చ్చ.. రచ్చ‌.. చేస్తున్నారు. 

 

ఇక స‌డెన్‌గా త‌మ‌న్ మ‌హేష్ చేయ‌బోయే నెక్స్ ట్ మూవీకి ప‌ని చేయ‌బోతున్నారన్న వార్త సినీ వ‌ర్గాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. సంక్రాంతికి విడుద‌లైన స‌రిలేరునీకెవ్వ‌రు చిత్రానికి దేవిశ్రీ అందించిన మ్యూజిక్ అంతగా హిట్ కాలేదనే చెప్పాలి. విన‌గా విన‌గా ఎప్ప‌టికో ప‌ర్వాలేద‌నిపించాయి. కానీ త‌మ‌న్ అల‌వైకుంఠ‌పురానికి అందించిన మ్యూజిక్ మాత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. అందులోని ఆడియో సాంగ్స్ విడుద‌లైన‌పట్టి నుంచే మంచి ఊపందుకున్నాయి. ఇటీవ‌ల త‌మ‌న్  మ్యూజిక్ అందించిన చిత్రాల‌న్నీ హిట్ కావ‌డమే కాకుండా. అందించిన సాంగ్స్ అన్నీ కూడా సూప‌ర్ హిట్ అయ్యాయి. ఈ మ‌ధ్య విడుద‌ల‌మైన ప్ర‌తిరోజూపండ‌గే, వెంకీమామ మొత్తం మూడు చిత్రాలు మ్యూజిక్ సూప‌ర్ హిట్ అయ్యాయి. హ్య‌ట్రిక్ హిట్ అనే చెప్పాలి. 

 

ఇటీవ‌లె మ‌హేష్ ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో దేవిశ్రీ మ్యూజిక్ సూప‌ర్బ్ అని బ్యాక్ రౌండ్ మ్యూజిక్ దేవి త‌ర్వాతే ఎవ్వ‌రైనా అన్నారు. అలాగే త‌న ఫేవ‌రెట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ‌ప్ర‌సాద్ అన్నారు. మ‌రి ఇంత‌లోనే త‌మ‌న్‌కి మారడానికి కార‌ణం ఏంటో అర్ధం కావ‌డం లేదుకాని త‌మ‌న్ మాత్రం వ‌రుస హిట్‌ల‌తో దూసుకుపోతున్నారు. అయితే ఈ చిత్రానికి త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నార‌న్న‌ది అధికారికంగా ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. మ‌రి త‌మ‌న్ ఒక‌వేళ అవ‌కాశం వ‌స్తే మ‌హేష్‌కి ఎలాంటి మ్యూజిక్‌ని అందిస్తారు. ఒక‌వేళ అది కూడా హిట్ కొడితే క‌నుక ఇక త‌మ‌న్ ఎక్క‌డా దొర‌క‌డ‌నే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: