నేటి సమాజంలో ఆడబిడ్డలకు రక్షణ కరువైపోయింది. ప్రతిరోజు బయట ఎన్నో ఘోరాలు జరుగుతున్నా పరిచయం లేని వారిని గుడ్డిగా ఎలా నమ్ముతారో వారికే తెలియాలి. అస్సలు పరిచయం లేని వారితో కొద్దిసేపటి పరిచయానికి చాలా చేరువుగా అయిపోయి తర్వాత తాము మోసపోయామని తెలుసుకుని బాధపడే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా కొందరు అయితే అందమైన అమ్మాయిలను వారి వాక్చాతుర్యంతో మాయ చేసి శారీరకంగా వాడుకుని వదిలేస్తున్నారు.

 

మహిళలకు రక్షణ కల్పించేందుకు ఎన్నో చట్టాలను ప్రభుత్వం తీసుకొని వచ్చినా మోసం చేసేవారు తగ్గట్లేదు మోసపోయే వారి సంఖ్య అస్సలే తగ్గట్లేదు. తాజాగా జరిగిన సంఘటన మహారాష్ట్ర మొత్తాన్ని కుదిపేసింది. ట్రైన్లో పరిచయమైన ఒక అమ్మాయిని తన ఫ్రెండ్ సహాయంతో లాడ్జి కి తీసుకెళ్ళి అక్కడ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అభం శుభం తెలియని ఆడపిల్లని రేప్ చేసిన తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. తాను మోసపోయానని తెలుసుకుని యువతి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సంఘటన మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో జరగడం గమనార్హం.

 

ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ... పూజ అనే యువతి జాబ్ కోసం మహారాష్ట్ర నుంచి నగరానికి ట్రైన్లో వస్తుండగా మధ్యలో వివేకానంద అనే వ్యక్తి ఆమెతో మాటలు కలిపాడు. ఉద్యోగం ఇస్తానని నమ్మబలికి తన ఫ్రెండ్ రాజుతో కలిసి రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న శ్రీ కృష్ణ లాడ్జి కి తీసుకెల్లి అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత చిన్నగా అక్కడి నుండి ఇద్దరు మృగాళ్లు జారుకున్నారు. సంఘటన నుండి కొద్ది సేపటి తరువాత తేరుకున్న యువతి పోలీసులకి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు వ్యక్తులపై సెక్షన్ 376 506 కింద కేసులు నమోదు చేసి వారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: