ఛలోతో టాలీవుడ్ కి హీరోయిన్ గా అడుగుపెట్టిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న, ఏ ముహూర్తాన ఇక్కడికి హీరోయిన్ గా వచ్చిందో తెలియదుగాని, దాదాపుగా ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలు సాధించాయి. మొదటి సినిమా ఛలో తో తొలి హిట్ అందుకున్న రష్మిక, ఆ తరువాత విజయ దేవరకొండ సరసన గీత గోవిందంలో నటించి మరొక సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు లో నటించి మరొక హిట్ ని అందుకుంది. 

 

నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ రోల్ గురించి అనుకున్నప్పుడే ఈ క్యారెక్టర్ కు రష్మిక అయితేనే బాగుంటుందని దర్శకుడు అనిల్ భావించారట. అదే విషయాన్ని హీరో మహేష్ కు కూడా చెప్పడంతో ఆయన కూడా అందుకు ఒప్పుకున్నారట. అయితే అప్పటివరకు కూడా రష్మిక ఈ సినిమాలో మాదిరిగా గోలగా అల్లరి చేస్తూ నటించిన సినిమా లేదని, అయితే ఈ సినిమా తరువాత తప్పకుండా ఆమెకు మంచి ఎనేర్జిటిక్ హీరోయిన్ అనే పేరు వస్తుందని మహేష్, అనిల్ భావించారట. ఇక అనుకున్న విధంగా సినిమా బాగా తెరకెక్కడం, అలానే రిలీజ్ తరువాత సినిమాపై ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించి థియేటర్స్ కు క్యూ కట్టడంతో సరిలేరు సూపర్ హిట్ కొట్టింది. 

 

ఇక సినిమాలో రష్మిక పాత్ర పై కొందరు ఓవర్ చేసింది అంటూ విమర్శలు చేస్తున్నప్పటికీ, ఆమెకు కేటాయించిన పాత్ర అటువంటిదని, కాబట్టి ఆ పాత్రకు అలా నటించకపోతే సెట్ కాదని అంటున్న వారు కూడా ఉన్నారు. ఏది ఏమైనప్పటికి సూపర్ స్టార్ తో చేసిన ఫస్ట్ మూవీతో బెస్ట్ హిట్ అందుకోవడంతో ప్రస్తుతం రష్మిక అమితానందాన్ని వ్యక్తం చేస్తోందని అంటున్నారు. ఇక ప్రస్తుతం బన్నీ, సుకుమార్ మూవీ తో పాటు భీష్మ సినిమాలో కూడా నటిస్తున్న రష్మిక కు సరిలేరు సక్సెస్ తో మరిన్ని అవకాశాలు వచ్చి పడుతున్నాయట....!!

మరింత సమాచారం తెలుసుకోండి: