టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే భరత్ అనే నేను, మహర్షి సినిమాల సక్సెస్ లతో మంచి జోష్ మీదుండగా, ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి మంచి హిట్ గా నిలిచి ఆయన ఆనందాన్ని మరింత పెంచింది. ఒక్క ఓవర్సీస్ లో తప్ప దాదాపుగా అన్ని చోట్ల ఇప్పటికీ మంచి కలెక్షన్ తో ముందుకు నడుస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు, మిలిటరీ మేజర్ అజయ్ కృష్ణ అనే పాత్రలో నటించగా ఆయన సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. 

 

ఇక దాదాపుగా కొన్నేళ్ల విరామం తరువాత సీనియర్ హీరోయిన్ విజయశాంతిసినిమా ద్వారా టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అయిన ఆనందంలో మహేష్ బాబు, దీనిని మరింతగా ప్రమోట్ చేయాలనే ఉద్దేశ్యంతో పలు ఇంటర్వ్యూ లు ఇవ్వడంతో పాటు ఇటీవల కొందరు సైనికాధికారులు ఏర్పాటు చేసిన మీట్ కు హాజరై వారిని ఉద్దేశించి ప్రసంగించారు. దానితో పాటు మొన్న సంక్రాంతి పండుగ నాడు హైదరాబాద్ లోని మై హోమ్ జెవెల్ ప్లాట్స్ లో ఉండే ఫ్యామిలీస్ వద్దకు దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి వెళ్లి వారితో సరదాగా మహేష్ ఇంటరాక్ట్ అవడం జరిగింది. 

 

ఇక ఆ ఫ్యామిలీస్ మధ్యకు మహేష్ చేరుకోగానే ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా సందడిగా మారిపోయింది. ముఖ్యంగా యూత్, మాస్ తో పాటు ఫ్యామిలీస్ లో కూడా మహేష్ కు ఫ్యాన్స్ విపరీతంగా ఉంటారు. ఇక వారితో జరిగిన ఈ మీట్ లో భాగంగా అక్కడి వారు అడిగిన ప్రశ్నలకు మహేష్, అనిల్ రావిపూడి సరదాగా సమాధానాలు ఇచ్చారు. అయితే మధ్య మధ్యలో మహేష్ బాబు తన కామెడీ పంచ్ డైలాగ్స్ తో అక్కడి వారందరినీ ఎంతో సరదాగా నవ్వించడం జరిగింది. అది చూసిన అక్కడి ఫ్యామిలీస్, సూపర్ స్టార్ మహేష్ గారు, మీది మాములు టైమింగ్ కాదండి బాబు అంటూ ఆయనపై సరదాగా కామెంట్స్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: