తెలుగు లో ఇప్పుడు కొత్త హీరోయిన్ల జోరు బాగా పెరిగిపోతుంది. సింహాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో రకూల్ ప్రీత్ సింగ్ వరుస విజయాలు అందుకుంటూ టాప్ హీరోలతో నటిస్తూ మంచి పొజీషన్లోకి వెళ్లింది. తెలుగులో అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే మూవీలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీ మూడు జనరేషన్స్ నటించిన మనం మూవీలో అతిథి పాత్రలో కనిపించింది. కెరీర్ బిగినింగ్ లో ఈ అమ్మడు కాస్త బొద్దుగా ముద్దగా ఉండేది.. తర్వాత స్లిమ్ గా మారి మంచి ఫిట్ నెస్ సంపాదించింది. తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం హర్రర్, కామెడీ జోనర్లో వస్తున్న సినిమాలకు మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా లారెన్స్ ముని తర్వాత కాంచన సీక్వెల్స్ వరుస విజయాలు అందుకుంటున్నారు. అయితే హీరోయిన్లు సైతం ఇలాంటి మూవీస్ లో నటించడానికి బాగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారిగా కెరీర్లో హారర్ సినిమాలో రాశీఖన్నా నటించనుందా అంటే ఔననే కోలీవుడ్ వర్గాలు చెబుతున్నారు.
సుందర్.సి దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ‘అరాన్మనై’ సిరీస్ చిత్రాలు కమర్షియల్గా మంచి వసూళ్లను సాధించాయి. గతంలో ఈ తరహా సినిమాల్లో స్టార్ హీరోయిన్లు సైతం నటించారు. మొదటి భాగంలో హన్సిక హీరోయిన్ గా నటించగా, రెండో భాగంలో త్రిష, హన్సిక హీరోయిన్లుగా కనిపించారు. తాజాగా ‘అరాన్మనై-3’ పేరుతో ప్రీక్వెల్ను రూపొందించేందుకు దర్శకుడు సుందర్.సి సన్నాహాలు చేస్తున్నారు. హారర్ కామెడీ ఇతివృత్తంతో రూపొందనున్న ఈ మూవీలో రాశీఖన్నా దయ్యం పాత్రలో నటించనున్నట్లు చెబుతున్నారు. ఈ మూవీ మూడో భాగంలో రాశీఖన్నా నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ప్రేమకథలు, వినోదాత్మక చిత్రాల్లో నటించిన రాశీఖన్నా కెరీర్లో ఇదే తొలి హారర్ సినిమా కావడం గమనార్హం. మరి ఈ మూవీ రాశీఖన్నాకు ఎంత వరకు సక్సెస్ ఇస్తుందో చూడాలి.