బాహుబలి సినిమా తర్వాత అనుష్క రేంజ్ పెరిగిపోయింది. అప్పటి నుండి ఆమె సోలో హీరోయిన్ గా లీడ్ రోల్స్ లో  సినిమాలు చేస్తుంది. బాహుబలి తర్వాత ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా వచ్చిన భాగమతి ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్ము దులిపింది. దాంతో తన తర్వాతి చిత్రం కూడా హీరోయిన్ ప్రాధాన్యమున్న చిత్రంలోనే నటిస్తుంది.

 

 

కోనవెంకట్ నిర్మాణంలో నిశ్శబ్దం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా చిత్రీక్రరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీ గా ఉంది చిత్ర యూనిట్ హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆర్ మాధవన్ ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో అనుష్క మూగ, చెవిటి అమ్మాయిగా కనిపించనుంది. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి.

 

అయితే ఈ సినిమాని మొదటగా జనవరి 31 వ తేదీన రిలీజ్ చేయాలని భావించారు. కానీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కూడా సినిమా రిలీజ్ కి గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదు. అలాగే ఇప్పటి వరకు ట్రైలర్ కూడా విడుదల చేయలేదు. అంతే కాదు సినిమా గురించిన ఎలాంటి హడావిడి లేదు. దాంతో ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం అవనుందని తెలుస్తుంది. ఈ వాయిదాకు కారణం సాంకేతిక కారణాలే అని తెలుస్తోంది. 

 

దీంతో కొంత నిరుత్సాహానికి గురైన అనుష్క ఫ్యాన్స్ కొత్త డేట్ ఎప్పుడో చెప్పాలని కోరుతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీలో మాధవన్, అంజలి, షాలిని పాండేలతో పాటు హాలీవుడ్ నటుడు మైకేల్ మాడిసెన్ కూడా నటించారు. మరి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: