తమళనాట సంచలన విజయం సాధించిన 'అసురన్' సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ధ‌నుష్ హీరోగా న‌టించిన ఈ చిత్రం కులాల ఆధిప‌త్యం, హ‌త్య‌ల నేప‌థ్యంలో రూపొందింది. అయితే ఈ రీమేక్ హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు దక్కించుకున్నారు. వెంకీమామ విజ‌యంతో సూప‌ర్‌హిట్‌ని సొంతం చేసుకున్న విక్ట‌రీ వెంక‌టేష్ రెట్టింపు ఉత్సాహంతో ఈ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, కళైపులి ఎస్ థాను సంయుక్త సమర్పణలో ఈ సినిమా రూపొందనుంది. 

 

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ చిత్రం ఇప్ప‌టికే సెట్స్‌పైకి కూడా వెళ్లింది. అయితే సినిమా టైటిల్ కానీ వెంకీ లుక్ కానీ బయటకు విడుదల చేయలేదు టీమ్. తాజా సమాచారం మేరకు ఈ చిత్రానికి ‘నారప్ప’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. మ‌రి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఇదే టైటిల్ ను ఖాయం చేస్తారా లేదా అనేది చూడాలి అధికార ప్ర‌క‌ట‌న వ‌చ్చే తెలియ‌ని ప‌రిస్థితి. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని, ఈ మేరకు అందుకు తగ్గ లొకేషన్స్ వేటలో చితయూనిట్ పడిందని తెలుస్తోంది. ఈ మేర‌కు సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను 'అనంతపురం'లో చిత్రీకరిస్తున్నారు. 

 

నెల రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో వెంకటేశ్ తో పాటు ముఖ్య పాత్రధారులు పాల్గొంటున్నారు. ఆ వెంటనే హైద‌రాబాద్ లోనూ కొంత‌మేర షూటింగ్ జరుపనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్ప‌టికే హైదరాబాద్ లొకేష‌న్లు కూడా ఫైనల్ చేశారట. శరవేగంగా షూటింగ్ ఫినిష్ చేసి ఈ ఏడాది వేస‌విలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలనేది ప్లాన్ అన్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా, ఈ చిత్రంలో వెంక‌టేశ్ స‌ర‌స‌న ప్రియమణిని ఎంపిక చేశారు. వాస్త‌వానికి ఈ సినిమా కోసం మొదట శ్రీయ అనుకున్నప్పటికీ, రష్ లుక్‌లో ప్రియమణి అయితే కరెక్ట్‌గా సరిపోతుందని చిత్రయూనిట్ ఆమెను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: