టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లు నటించిన తాజా సినిమాలు సరిలేరు నీకెవ్వరు, అలవైకుంఠపురములో ఇటీవల సంక్రాంతి కానుకగా ఒక రోజు తేడాలో ప్రేక్షకుల ముందు వచ్చి మంచి సక్సెస్ ని అందుకున్నాయి. సరిలేరు పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కగా, అల సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. సరిలేరు సినిమా సెకండ్ హాఫ్ లో కొన్ని లోపాలున్నాయని, అలానే లెంగ్త్ కూడా బాగా ఎక్కువయిందని దర్శకుడు అనిల్ రావిపూడి పై కొంత విమర్శలు వచ్చాయి. ఇక అలవైకుంఠపురములో సినిమా కూడా సెకండ్ హాఫ్ లో కొంత ల్యాగ్ ఉందని, ముఖ్యంగా ఈ సినిమా చూస్తున్నంతసేపు గతంలో త్రివిక్రమ్ తీసిన అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాల్లోని సీన్స్ పదే పదే గుర్తుకు వస్తాయనే విమర్శలు వచ్చాయి. 

 

అయితే వాటన్నిటినీ వెనక్కు నెట్టి, ఈ రెండు సినిమాలు కూడా ఇటీవల రూ.100 కోట్ల షేర్ ని సునాయాసంగా అందుకుని మంచి కలెక్షన్స్ తో ముందుకు సాగడం జరిగింది. నిజానికి ఇప్పటివరకు ఈ రెండు సినిమాల కలెక్షన్స్ విషయమై ఇప్పటివరకు ప్రచురితం అయిన లెక్కలను బట్టి ఏది నిజమో, ఏది అబద్దమో అర్ధం కాక, ఇద్దరు హీరోల ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు సైతం గందరగోళంలో పడ్డారు. అయితే దానిపై కొందరు విశ్లేషకులు మాట్లాడుతూ, నిన్నటి సోమవారం వచ్చే కలెక్షన్స్ ని బట్టి ఏ సినిమా రేంజ్ ఏంటి అనేది తెలిసిపోనుందని చెప్పడం జరిగింది. ఇక గడిచిన నిన్నటి రోజున ఈ రెండు సినిమాలకు వచ్చిన కలెక్షన్ ని బట్టి పరిశీలిస్తే, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సరిలేరు రూ. 3.20 కోట్లు కొల్లగొట్టగా, అల సినిమా రూ. 2.50 కోట్లు కొల్లగొట్టింది. 

 

దీనిప్రకారం మన తెలుగు రాష్ట్రాల్లో సూపర్ స్టార్ ప్రభంజనం ఏ మాత్రం తగ్గలేదని తేటతెల్లం అయింది. ఇకపోతే ఓవర్సీస్ లో మాత్రం సరిలేరు సినిమా పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా చాలా తక్కువ కలెక్షన్ పొందుతుండగా, మరోవైపు అలవైకుంఠపుములో మాత్రం ఇప్పటికే 3 మిలియన్లకు చేరువ అవుతూ దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. దీనిని బట్టి అక్కడ అల దున్నేస్తోందని తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ స్టార్, అలానే ఓవర్సీస్ లో స్టైలిష్ స్టార్ అదరగొడుతున్నారన్నమాట....!!

మరింత సమాచారం తెలుసుకోండి: