టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా జనవరి 11న సంక్రాంతి ముందు విడుదలై ప్రేక్షకుల  అలరించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా  నిలిచారు  విజయశాంతి. నాటి తరంలో అగ్రకథానాయికగా ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన విజయశాంతి ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి సినిమాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో విజయశాంతి అభిమానులందరూ తమ అభిమాన నటి అయిన విజయశాంతి రాజకీయాలతో పాటు సినిమాల్లో కూడా నటిస్తే ఎంత బాగుండు అని కోరుకున్నారు. 

 


 అయితే విజయశాంతి అభిమానుల కోరికను విన్నా..  దేవుడు మాత్రం కాస్త లేట్ గానే కరుణించినట్లు  ఉన్నాడు. అందుకే దాదాపు పదమూడేళ్ళ తరవాత మరో సారి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ప్రొఫెసర్ భారతి గా నటించింది. ఇక ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించింది విజయశాంతి. అయితే విజయశాంతి సినిమాల్లోకి తీసుకురావడానికి ఎందరో  దర్శక నిర్మాతలు ప్రయత్నించినప్పటికీ అది చివరికి అనిల్ రావిపూడి తో సాధ్యమైంది. ఇకపోతే తాజాగా ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు అనిల్ రావిపూడి... విజయశాంతిని సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం ఒప్పించిన తీరును వివరించారు.

 

 విజయశాంతి గారు రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉన్నారు... సినిమాలు చేయాలి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఆమె లేరు. అలాంటి పరిస్థితుల్లో నేను సరిలేరు నీకెవ్వరు కథ  పట్టుకుని విజయశాంతి గారు చుట్టూ ఎన్నో రోజులు  తిరిగాను. ఊరికే తిరుగుతున్న నన్ను  చూసిన విజయశాంతి గారు... కథ వినేసి నో  చెప్తే వెళ్ళిపోతాడు  కదా అని అనుకున్నారు. అయితే కథ వింటే చాలు విజయశాంతి గారు నో  చెప్పారు అన్నది నా నమ్మకం. అనుకున్నట్టుగానే కథ విన్న తర్వాత ఆమె ఈ సినిమాలో నటించడానికి నో చెప్పలేదు అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. నేను దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా ఆమె రీ ఎంట్రీ ఇవ్వడం ఆమె నటించిన పాత్రకు మంచి పేరు రావడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు అనిల్ రావిపూడి.

మరింత సమాచారం తెలుసుకోండి: