సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమాలంటే అభిమానుల‌లో ఎంత‌టి క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌న‌దేశంలోనే కాక విదేశాల‌లోను ర‌జనీకాంత్ సినిమాలు వస్తున్నాయంటే తెగ ఆసక్తితో ఎదురు చూస్తారు.  ముఖ్యంగా చైనా, హాంగాంగ్, మలేషియా, జపాన్ లో రజినీ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది.  త‌లైవా రీసెంట్‌గా ద‌ర్భార్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ మూవీ  బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేసింది.  చాలా  కాలం తర్వాత పోలీస్ ఆఫీసర్ గా నటించారు రజినీకాంత్. ప్రస్తుతం తమిళనాడులో దర్బార్ సినిమాతో తైలవా సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాడు.మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 

తెలుగు తమిళ్ హిందీ లో ఒకేసారి విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లో కలుపుకొని 200కోట్లకు పైగా వసూళ్లను అందుకున్నట్లు తెలుస్తోంది.  దీంతో సౌత్ పరిశ్ర‌మ‌లో ఐదు సార్లు డ‌బుల్ సెంచ‌రీ సాధించిన ఏకైక న‌టుడిగా ర‌జ‌నీకాంత్ నిలిచారు. గ‌తంలో ర‌జ‌నీకాంత్ న‌టించిన రోబో, క‌బాలి, 2.0, పేట మూవీస్ 200 కోట్ల‌కి పైగా వ‌సూళ్ళు రాబ‌ట్టిన సంగ‌తి తెలిసిందే. సినిమా టాక్ ఎలా ఉన్నా కేవలం రజినీ మానియాతో ఈ మాయ చేస్తున్నారని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.  ఇకపోతే సినిమాకు పెద్దగా పాజిటివ్ టాక్ వచ్చిందా అంటే అదేమీ లేదు.తెలుగులో పలు ఏరియాల్లో ప్రాఫిట్స్ జోన్ లోకి తెచ్చిన దర్బార్ అనుకున్నంతగా అయితే కలెక్షన్స్ ని రాబట్టలేకపోయింది.

 

తెలుగులో తైలవా గత సినిమాలకంటే దర్బార్ కొంచెం మంచి ఓపెనింగ్స్ ని అయితే అందుకుంది.  ఇదే సమయానికి మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో హిట్ టాక్ తెచ్చుకొని భారీ కలెక్షన్లు రాబట్టాయి.  మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన దర్భార్ మూవీలో న‌య‌న‌తార హీరోయిన్ గా నటించింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న‌ ఈ మూవీకి అనిరుథ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించారు. ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ త‌న 168వ చిత్రాన్ని శివ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నారు. కీర్తి సురేష్‌, ఖుష్బూ, మీనా మూవీలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: