‘బాహుబలి’ మూవీతో అనుష్క నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయింది. దీనితో ఆమె ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలని భారీ బడ్జెట్ తో తీసిన ‘నిశ్శబ్దం’ మూవీ వాయిదా పడటానికి గల కారణం ఆమె మూవీ పట్ల బయ్యర్లు ఆసక్తి కనపరచక పోవడం అన్న వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమాను తెలుగు తమిళ హిందీ భాషలలో ఒకేసారి విడుదల అయ్యే విధంగా మార్కెట్ చేయాలని ప్రయత్నించారు.

అయితే గత ఏడాది ‘సాహో’ ‘సైరా’ మూవీలు తమిళనాడులో ఘోర పరాజయం చెందడంతో పాటు బాలీవుడ్ లో ‘సైరా’ కు కూడ అవమానం జరగడంతో ‘నిశ్శబ్దం’ మూవీ గురించి బాలీవుడ్ కోలీవుడ్ బయ్యర్లు ఏమాత్రం పట్టించుకోలేదు అని తెలుస్తోంది. ఈ మూవీలో హాలీవుడ్ యాక్టర్ మైఖేల్ మదసన్ నటించినప్పటికీ ఆ విషయాన్ని కూడ బాలీవుడ్ కోలీవుడ్ బయ్యర్లు పట్టించుకోక పోవడంతో ఈ మూవీకి మార్కెటింగ్ సమస్యలు ఏర్పడ్డాయి అని తెలుస్తోంది.

వాస్తవానికి ఈ మూవీకి తమిళ మార్కెట్ లో క్రేజ్ ఏర్పడటానికి తమిళ హీరో మాధవన్ హీరోగా పెట్టినా కోలీవుడ్ బయ్యర్లు ‘నిశ్శబ్దం’ గురించి ఏమాత్రం పట్టించు కోవడం లేదని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ ఊహించిన స్థాయికన్నా ఎక్కువ అవ్వడంతో పాటు ఈ సినిమాలోని కీలక సన్నివేశాలు అన్నీ అమెరికాలో తీయడంతో పాటు అనుష్క భారీ పారితోషికం కూడ కలిసి పోవడంతో ‘నిశ్శబ్దం’ కు బయటకు చెప్పుకోలేని సమస్యలు ఏర్పడ్డాయి అని టాక్. 

దీనికితోడు అనుష్క ఈ మూవీలో అందంగా కనిపించడానికి ఆమెకు ఏర్పడ్డ లావు సమస్యల రీత్యా గ్రాఫిక్స్ వర్క్స్ పై కూడ బాగా ఖర్చు అయినట్లు తెలుస్తోంది. దీనితో అనుష్కను ఎవరైనా హీరోయిన్ గా పెట్టుకోవాలి అంటే ఆమె భారీ పారితోషికంతో పాటు ఆమె అందంగా కనిపించడానికి భారీ గ్రాఫిక్ వర్క్స్ ఖర్చును కూడ భరించడానికి సిద్ధపడే వారు మాత్రమే అనుష్కను ఎంపిక చేసుకోవాలి అంటూ ఇండస్ట్రీలో సెటైర్లు పడుతున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: