నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో బాలకృష్ణ ఆ మద్య క్రిష్ దర్శకత్వంలో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ మూవీతో వంద సినిమాలు పూర్తి చేసుకున్నారు.   ఈ మూవీ సూపర్ హిట్ అందుకుంది.  ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంతో తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ నేపథ్యంలో ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు మూవీస్ డిజాస్టర్ తర్వాత ఎన్నికల్లో బిజీ అయ్యారు.  హిందూపురం నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికలయ్యారు.  ఈ మద్య రూలర్ మూవీతో మరో అపజయం అందుకున్నారు.  ప్రస్తుతం సింహా,లెజండ్ మూవీస్ తో భారీ విజయాలు అందించిన బోయపాటి శ్రీనివాస్ తో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

 

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్ గా  నటిస్తుందని  ఆ మద్య వార్తలు వచ్చాయి. కానీ ఆమె ఒక ట్వీట్ తో ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ మూవీలో కేథరీన్ ట్రెసా ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నట్లు విస్తృతంగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ మూవీ బాలయ్య డిఫెరెంట్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ ఇప్పటికే గుండుతో ఉన్న ఫోటోలు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ మూవీలో   కేథరీన్ ట్రెసా నటించబోతుందని వార్తలు వచ్చాయి. కానీ  అది కార్యరూపం దాల్చలేదు.  బోయపాటి కేథరిన్ సంప్రదించగా అంతా ఓకే అయింది. కానీ రెమ్యునరేషన్ విషయంలోనే తేడా కొట్టిందట.

 

కేథరిన్ భారీగా పారితోషికం డిమాండ్ చేయడంతో నిర్మాతలు ఆశ్చర్యపోయారు. డీల్ కుదరకపోవడంతో కేథరిన్ ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్.  ఇప్పుడు మేకర్స్ బాలకృష్ణ సరసన మరో నటి కోసం వెతుకుతున్నారు.  అయితే ఈవిషయంపై చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.. కేవలం సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు మాత్రమే. అయితే ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అన్న విషయం చిత్రయూనిట్ అఫిషియల్ గా ప్రకటించలేదు. బాక్సాఫీస్ వద్ద సింహా, లెజెండ్ బ్లాక్ బస్టర్ కావడంతో, ఈ సెన్సషనల్ కాంబోపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: