పూరీ జగన్నాథ్ ఆశీస్సులతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీలోకి అడుగుపెడుతున్నాడు. బాహుబలిని హిందీలో ప్రమోట్ చేసిన కరణ్ జోహార్ బ్లెస్సింగ్స్ తో విజయ్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. యూత్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పూరీ, విజయ్ సినిమా షూటింగ్ సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. 


ఇస్మార్ట్ శంకర్ హిట్ తో పూరీ ఫామ్ లోకి రావడం ఆలస్యం.. విజయ దేవరకొండతో సినిమా కన్ఫార్మ్ చేశాడు. సినిమా కోసం హీరో ఇప్పటికే థాయిలాండ్ వెళ్లి మార్షల్ ఆర్ట్స్ లో మెళకువలు నేర్చున్నాడు. ఇస్మార్ట్ శంకర్ మాదిరి ఈ సినిమాను కూడా పూరీ, చార్మి సంయుక్తంగా నిర్మించాలనుకుంటున్నారు. అయితే.. కబీర్ సింగ్ ఒరిజిన్ వెర్షన్ అర్జున్ రెడ్డి హీరోగా విజయ్ పేరు బాలీవుడ్ కు పరిచయమైంది. హిందీలోకి వెళ్లాలనుకున్న విజయ్ డ్రీమ్ ఈ పాన్ ఇండియా మూవీతో తీరుతోంది. 

 

విజయ్ లాస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో రిలీజైంది. పూరీ సినిమా ఓ మెట్టు ఎక్కి.. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్స్ లో ఒకటైన ధర్మ ప్రొడక్షన్ పతాకంపై.. కరణ్ జోహార్, అపూర్వ మెహతా, పూరీ, చార్మీతో కలిసి ఈ మూవీ నిర్మిస్తున్నారు. 

 

విజయ్, పూరీ సిినిమా షూటింగ్ ముంబయిలో లాంఛనంగా మొదలుకాగా.. తొలి సన్నివేశానికి చార్మి క్లాప్ ఇచ్చింది. సోమవారం నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ లెక్కన యమా స్పీడ్ గా సినిమాలు తీసే పూరీ.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను సమ్మర్ నాటికి రెడీ చేయడం ఖాయం. విజయ్ దేవరకొండకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే ఆయనను చాలామంది ఫాలో అవుతున్నారు. తమ అభిమాన హీరో మూవీ ఎపుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. విజయ్ దేవరకొండ డైలాగ్స్ కోసం కాచుకొని కూర్చున్నారు. చూడాలి మరి విజయ్ ఎలా మేనేజ్ చేస్తాడో..!

మరింత సమాచారం తెలుసుకోండి: